Nagarjuna: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ పర్వం కొనసాగుతోంది. చాలామంది హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సౌత్ నార్త్ అనే బేధం లేకుండా కలిసికట్టుగా సినిమాలు చేస్తున్నారు. ఈ రకంగానే “RRR” సౌత్ లో భారీ మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కి ఊహించని విజయం సొంతం చేసుకోవడం తెలిసిందే. ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా లభించింది. ఈ రకంగానే ఇప్పుడు చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న “కల్కి 2898 AD”లో విజయ్ దేవరకొండ, నాని, ఎన్టీఆర్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ లాంటి లెజెండరీ నటులు కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరో కింగ్ నాగార్జున… ఎక్కువ మల్టీస్టారర్ ప్రాజెక్టులు ఈమధ్య చేస్తూ ఉన్నారు. గతంలో తమిళ్ హీరో కార్తీక్ తర్వాత ఇటీవల అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లతో “నా సామిరంగా” అనే సినిమా చేయడం జరిగింది. ప్రజెంట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ్ హీరో ధనుష్ తో కలిసి సినిమా చేస్తున్నారు. కాగా ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి నాగార్జున రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాని ఓ తమిళ దర్శకుడు తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమాలో నాగార్జున కీలకపాత్ర పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 1998లో “అంగేరి” అనే సినిమా రావడం జరిగింది. మహేష్ భట్ తరికెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, నాగార్జున హీరోలగా నటించిన పూజ భట్, సోనాలి బింద్రే హీరోయిన్ లుగా నటించారు. సో ఈ రకంగా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి నాగార్జున ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.