DNS: అక్కినేని నాగార్జున సంక్రాంతి పండుగకు “నా సామిరంగ”తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం తెలిసిందే. విజయ్ బీన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. పల్లెటూరి నేపథ్యంలో రివేంజ్ డ్రామాగా “నా సామిరంగ” అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. సినిమాలో నాగార్జునతో పాటు నటించిన అల్లరి నరేష్ క్యారెక్టర్.. సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే నాగార్జున గత కొన్ని సంవత్సరాల నుండి మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున మరో మల్టీస్టారర్ సినిమా చేయడానికి రెడీ అయ్యారు.
ఈ సినిమాలో నాగార్జునతో పాటు తమిళ్ హీరో ధనుష్ కీలక పాత్ర పోషించబోతున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. నేడే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కావడం జరిగింది. సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో తమిళ్ హీరో కార్తీతో నాగార్జున “ఊపిరి” అనే సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు మరో తమిళ హీరో ధనుష్ తో నాగార్జున సినిమా చేయడానికి రెడీ కావడం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
పైగా ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించడంతో సినీ లవర్స్ కి చాలా కొత్తగా అనిపిస్తుంది. తెలుగు చలనచిత్ర రంగంలో చాలా మంది కొత్తవారిని పరిచయం చేసిన డైరెక్టర్ గా శేఖర్ కమ్ములకి మంచి పేరుంది. కొన్ని సంవత్సరాల క్రితం నాగచైతన్యకి “లవ్ స్టోరీ” సినిమాతో మంచి విజయాన్ని అందించడం జరిగింది. చాలా కూల్ సబ్జెక్టులతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా.. శేఖర్ కమ్ముల సినిమాలు తెరకెక్కిస్తారు. ఇప్పుడు అదే రీతిలో కొద్దిగా మాస్ ఎలిమెంట్స్ జత చేసి నాగార్జున.. ధనుష్ లతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. “DNS” వర్కింగ్ టైటిల్ తో నేడే పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!