Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ షో స్టార్ట్ అయ్యి ఒక వారం గడిచిపోయింది. మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కావటంతో హౌస్ లో ప్రస్తుతం 13 మంది మాత్రం మిగిలి ఉన్నారు. మొదటి వారం నుండే హౌస్ లో ఇంటి సభ్యులకు భారీ ఎత్తున టాస్కులు ఇవ్వడంతో… కంటెస్టెంట్స్ మధ్య పోటీ నెలకొంది. ఎవరికివారు తమ గేమ్ ప్లాన్ తో హౌస్ లో రాణిస్తున్నారు. ఒకపక్క లవ్ ట్రాక్ లు మరోపక్క గ్రూపులు కూడా క్రియేట్ అయిపోతున్నాయి. ఈ క్రమంలో సింపతి ప్లే చేసే వాళ్ళు కూడా కెమెరాల ముందు వలవల ఏడుస్తున్నారు. ఈ రీతిగా ఎక్కువగా పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి పేరులు హౌస్ లో ఆడుతున్నారు.
ఈ క్రమంలో వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఒక్కొక్కరికి క్లాసులు పీకుతూ.. సింపతి గేమ్ ప్లే చేస్తున్న వారికి కూడా గట్టిగా ఊహించని షాక్ ఇచ్చారు. శోభా శెట్టి బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదలైన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉండటంతో.. నాగార్జున గట్టిగా క్లాస్ తీసుకున్నారు. ఇలా ఏడుస్తూ గేమ్ ఆడే వాళ్ళని..బిగ్ బాస్ షోలో టాప్ ఫైవ్ కి ఆడియన్స్ పంపించలేదని… వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత బిగ్ బాస్ 7కు పోల్ జరుగుతుందని.. దాంతో హౌస్ లో ఉన్న ప్రేక్షకులు గురించి బయట జనాలు ఏమనుకుంటున్నారో నాగార్జున వివరించారు.
దీనిలో 80శాతం పోల్స్ రతిక మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఈ క్రమంలో మొదటి వారం యాక్టివిటీ రూంలో రతిక పాడిన ఉడతా ఉడతా ఉచ్ అనే పాటను కూడా ప్లే చేశారు. ఈ పాటలో ఉడతా అని ఎన్నిసార్లు వచ్చిందని ప్రశ్నించగా రద్దీగా కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. ఉడతా ఉడతా ఊచ్ అనే పాట లూప్ లో ప్లే చేస్తే అనే పదం 1056సార్లు వచ్చిందని కరెక్టుగా చెప్పటం.. నాగార్జున ఈ సందర్భంగా గుర్తు చేశారు.