టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో కెరీర్ పరంగా జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 2018లో విడుదలైన `భరత్ అనే నేను` దగ్గర నుంచి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన `సర్కారు వారి పా`ట వరకు అన్ని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి.
ప్రస్తుతం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన 28వ చిత్రాన్ని చేస్తున్నాడు. `ఎస్ఎస్ఎంబి 28` వర్కింగ్ టైటిల్తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలె సెట్స్ పైకి వెళ్లిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది.
ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా చిత్రం చేయబోతున్నాడు. అయితే మహేష్ సినీ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నప్పటికీ.. ఆయన సతీమణి, ఒకప్పటి హీరోయిన నమ్రత శిరోత్కర్ కు మాత్రం ఒకే ఒక సినిమా అంటే మహా ఇష్టమట.
ఇంతకీ మహేష్ కెరీర్ లో నమ్రత మెచ్చే మూవీ ఏదో తెలుసా.. `పోకిరి`. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం 2006లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. వసూళ్ల పరంగా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఈ సినిమా తర్వాత మహేష్ కెరీర్ మరింత ఊపందుకుంది. అయితే ఈ సినిమా అంటే నమ్రతకు ఎంతో ఇష్టమట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
https://newsorbit.com/news/mahesh-babu-a-thief-broke-into-mahesh-babus-house-what-happened-next.html
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!