సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ ఈ ఏడాది జూన్లో వివాహం చేసుకుని వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమాయణం కొనసాగిస్తున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
అయితే పెళ్లయిన నాలుగు నెలలకే ఈ జంట తల్లిదండ్రులయ్యారు. వీరికి పండంటి ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. కానీ ఎలా పుట్టారో వారు వెల్లడించనప్పటికీ సరోగసి ద్వారా వీరిద్దరూ పిల్లల్ని కన్నారని అంటున్నారు. అయితే ఇప్పుడిదే వివాదానికి దారి తీసింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించింది.
కవల పిల్లల పుట్టకకు సంబంధించి వివరాలు ఇవ్వాలని నయన్ దంపతులకు దేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ విషయంపై నెటిజన్ల నుంచి ఎన్నో విమర్శలు, మరెన్నో ట్రోలింగ్స్ ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విగ్నేష్ పరోక్షంగా సంచలన పోస్ట్స్ పెట్టాడు.
`నీ చుట్టూ ఉన్నవారిని గమనించు. నీకు తోడుగా ఉంటూ, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ.. నీ క్షేమం కోరుకునే వారే నిజమైన నీవాళ్ళు. ఇది ఎప్పటికి వాస్తవం` అని ఒక పోస్ట్ లో రాసుకొచ్చిన విఘ్నేష్.. మరో పోస్ట్ లో `సమయం వచ్చినప్పుడు అన్నీ నీ వద్దకు చేరుతాయి. అప్పటి వరకు సహనంతో ఉండు. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించు` అని పేర్కొన్నాడు. దీంతో విఘ్నేష్ పోస్ట్స్ కాస్త వైరల్ గా మారాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!