గత కొన్నాళ్ల నుంచి వరుస ప్లాపులతో సతమతం అవుతున్న టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య.. ఇటీవల విడుదలైన `కృష్ణ వ్రింద విహారి` సినిమాతో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కిన సంగతి తెలిసిందే. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్పై ఉషా మూల్పూరి నిర్మించారు.
ఇందులో షెర్లీ సెటియా హీరోయిన్గా నటిస్తే.. సీనియరల్ నటి రాధిక, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 23న విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.
టాక్ అనుకూలంగా ఉండటంతో.. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫిక్స్ `కృష్ణ వ్రింద విహారి` డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సాలిడ్ ధరకు సొంతం చేసుకుంది.
అయితే ఎలాగో ఈ మూవీ థియేట్రికల్ రన్ పూర్తి కావడంతో.. ఇప్పుడు ఓటీటీలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీపావళి పండుగ కానుకగా సెప్టెంబర్ 23న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ వారు డేట్ లాక్ చేశారు. మరి ఈ చిత్రం ఓటీటీలో ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
https://newsorbit.com/entertainment-news/nagashaurya-gave-clarity-on-who-to-marry.html
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!