Nindu Noorella Saavasam January 19 2024 Episode 137: ఇంతకుముందు ఎప్పుడు డబ్బులు ఇంట్లో పోలేదు ఇంట్లో ఎవరు డబ్బులు తీసి ఉంటారు అని అరుంధతి ఆలోచన చేస్తూ ఉండగా నీలా ఇల్లంతా చూస్తూ ఉండగా అరుంధతి చూసి ఇదే దొంగల అనిపిస్తుంది అని అనుకుంటుది. కట్ చేస్తే, చూసి వస్తానని చెప్పి ఇంకా రాలేదేంటి డబ్బును ఎలాగైనా సరే ఇల్లు దాటించేయాలి అని మనోహరి టెన్షన్ పడుతుంది. అమ్మ ఇంట్లో ఎవరూ లేరు అని నీలా చెప్తుంది. చూసావు కదా దొరికిపోయానంటే నిన్ను చంపేస్తాను అని మనోహరీ అంటుంది. అంతా చూసేనమ్మ మీరు వెళ్ళండి అని నీలా చెబుతుంది. ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నావు మను ఇల్లు వదిలి అని అరుంధతి చూస్తూ ఉండగానే మనోహరీ డబ్బులు తీసి తన చేతిలో పట్టుకుంటుంది. అది చూసిన అరుంధతి షాక్ అయిపోతుంది. అంటే డబ్బులు దొంగతనం చేసింది మనునా అని అరుంధతి అనుకుంటుంది.
అమ్మ జాగ్రత్త మిస్సమ్మను బయటకు పంపడమేమో కానీ ఎవరైనా చూస్తే మీరు బయటకు పోతారు అని నీలా అంటుంది.మిస్సమ్మను బయటికి పంపించడానికి డబ్బులు కొట్టేసి దొంగతనం దాని మీదకి నెట్టేసావా మను తప్పు చేస్తున్నావే ఇంత పెద్ద నింద వేయడం పాపమే అని అరుంధతి అంటుంది. మనోహరి ఆ డబ్బులు తీసుకొని వెళుతూ ఉండగా అరుంధతి వచ్చి డబ్బులు తీసుకొని వెళ్లకే పాపమని బ్రతిమిలాడుతుంది. అవేవీ పట్టించుకోకుండా మనోహరి వెళ్ళిపోతుంది. ఎవరైనా ఉన్నారా మనోహరీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుంది అని అరుంధతి పిలుస్తుంది. ఇంతలో రాథోడ్ లోపలికి వస్తూ ఉండగా మనోహరి భయపడిపోయి పరిగెత్తుకొస్తుంది లోపలికి. కట్ చేస్తే, వాళ్లు పట్టుకోవడమేమో గాని నువ్వే వాళ్లకు పట్టించేలా ఉన్నావ్ అని మనోహరి నీలా ని అంటుంది. ఇప్పుడు ఎలా అమ్మ అని నీలా అంటుంది.
ఈ డబ్బును బయటికి పంపించడానికి వేరే మార్గం వెతకాలి అని మనోహరి ఆలోచిస్తుంది. డబ్బు నీ దగ్గరే ఉందని చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేస్తాను అని అరుంధతి అంటుంది. కట్ చేస్తే, మిస్సమ్మ ఏడుస్తుంది సార్ చాలా మంచిది సార్ మిస్సమ్మ డబ్బు తీయలేదని నేను కచ్చితంగా చెప్పగలను సార్ మిస్సమ్మ బాధపడటం చూస్తుంటే జాబు మానేసి వెళ్ళిపోతుందేమో సార్ అని రాథోడ్ అంటాడు. తను జాబ్ ఎందుకు మానేసి వెళ్ళిపోతుంది అని అమరేంద్ర అంటాడు.మిస్సమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోవడమేంటండీ అని నిర్మల అంటుంది.అభిమానం కలిగిన పిల్ల కదా ఇంత నింద పడ్డాక ఎలా ఉంటుంది అని శివరాం అంటాడు. ఇప్పుడు ఎలా అమ్ములు అందరూ మిస్సమ్మని దొంగ అంటున్నారు తను ఇంట్లో నుంచి వెళ్ళిపోకూడదు అని అంజలి అంటుంది. ఇంతకుముందు మిస్సమ్మని ఎలా బయటికి పంపించాలని చూసేదాన్ని ఇప్పుడేంటి తన గురించి ఆలోచిస్తున్నావు అని అమృత అంటుంది.
తను మనకు కూడా సహాయం చేసింది కదా ఇలా నిందపడి వెళ్ళకూడదు తనకు ఏదో ఒకటి చేయాలి అని అంజలి అంటుంది. కట్ చేస్తే, గుప్తా గారు మనోహరి మిస్సమ్మని వెళ్లగొట్టడానికి డబ్బు కొట్టేసింది అని అరుంధతి చెబుతుంది. మనోహరి డబ్బులు తీసింది అని మిస్సమ్మకు చెప్పేస్తాను అని అరుంధతి అంటుంది. నువ్వు ఆ బాలికకు కనిపించుట వరము దాన్ని నువ్వు దుర్వినియోగం చేయడము సమన్వయసము కాదు అని గుప్తా అంటాడు. నేను చెప్తాను అని అరుంధతి అంటుంది. అటుల చెప్పినచో జరగబోయే అనర్ధములకు నీవే కారణం అవుతావు అని గుప్త అంటాడు. నువ్వు నన్ను భయపెడుతున్నావు గుప్తా నేను ఎలాగైనా సరే నిజం చెప్తాను అని అరుంధతి వెళ్తుంది. కట్ చేస్తే, భాగమతి బట్టలని సర్దుకొని వెళ్ళిపోతూ ఉండగా అరుంధతి వచ్చి ఏం చేస్తున్నావ్ మిస్సమ్మ అని అడుగుతుంది. వెళ్లేటప్పుడు కలిసి వెళ్దాం అనుకున్నాను అక్క మీ సహాయానికి చాలా థాంక్స్ అడక్కుండానే నాకు సహాయం చేశారు అక్క అని భాగమతి అంటుంది. నువ్వు ఏ తప్పు చేయలేదు మిస్సమ్మ అసలు దొంగ అని అరుంధతి చెప్పగానే ఉరుములు మెరుపులు గాలి వచ్చి అరుంధతి మాట భాగమతికి వినపడకుండా అయిపోతుంది.
అరుంధతి కూడా తనకి కనిపించకుండా మాయమైపోతుంది. అక్క ఎక్కడున్నావ్ అని అరుంధతి రూమ్ అంతా వెతుకుతుంది.మిస్సమ్మ నేను ఇక్కడే ఉంటే ఎక్కడ వెతుకుతున్నావ్ నువ్వు డబ్బులు దొంగతనం చేయలేదు మనోహరి దొంగతనం చేసింది అని అరుంధతి అంటుంది. ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళింది అని భాగమతి ఆలోచిస్తుంది. ఇక్కడే ఉంటే కనిపించడం లేదు అంటుంది అని అరుంధతి గుప్తా దగ్గరికి పరిగెత్తుకొస్తుంది. కట్ చేస్తే, గుప్తా గారు నేను మిస్సమ్మకు ఎందుకు కనిపించడం లేదు అని అడుగుతుంది. చెప్పాను కదా బాలిక విధికి ఎదురు వెళితే ఏమి జరుగుతుందో మరొకసారి ఇలా జరిగినచో పరిణామం తీవ్రంగా ఉండును అని గుప్తా అంటాడు. అందరూ వచ్చి ఏంటి మిస్సమ్మ వెళ్ళిపోతున్నావా అని అంటారు. ఇలా నిందను మోస్తూ బయటకి పోయి తప్పు చేసిన దానిలాగా మిగిలిపోతావా మిస్సమ్మ అని ఆనంద్ అంటాడు. ఎంతో ధైర్యంగా ఉండి మాకు ధైర్యం చెప్పే నీవు ఇప్పుడు ఇలా ఎలా వెళ్ళిపోతావు మిస్సమ్మ నువ్వు దొంగతనం చేయలేదు అంటే ఎవరు చేశారో పట్టుకుంటే తెలిసిపోతుంది కదా అని అంజలి అంటుంది.
ఏం చేయాలో ఇప్పుడే నాకు అర్థం అవుతుంది అని మిస్సమ్మ రాథోడ్ ని పిలుస్తుంది. ఏమైంది మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు.నిన్న నైట్ సిసి టీవీ చూడాలి అని భాగమతి అంటుంది. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకమ్మ అని శివరాం అంటాడు. నేను దొంగతనం చేయలేదని నిరూపించుకోవాలి కదా అంకుల్ అని భాగమతి అంటుంది. నువ్వు దొంగతనం చేసావని ఎవరు అనడం లేదు కదా ఎందుకు అని అమరేంద్ర అంటాడు. మీరు అనకపోయినా నేను నింద వేసుకుని బయటికి వెళ్లలేను కదా ప్లీజ్ అంకుల్ అని మిస్సమ్మ బతిమిలాడుతుంది. సరే రాథోడ్ తెచ్చి చూపించు అని అమరేంద్ర అంటాడు. రాథోడ్ సిసి టీవీ ఫుటేజ్ తెచ్చి సార్ ఇంట్లోకి దొంగ ఎవరూ రాలేదు మిస్సమ్మ తప్ప ఎవరు బయటికి వెళ్ళలేదు అని చెప్తాడు. చూడండి నేను బయటికి వెళ్ళేటప్పుడు నా చేతిలో బ్యాగు కూడా లేదు సూట్ కేసు కూడా లేదు అని మిస్సమ్మ అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?