Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో,పద్మావతితన భార్య అని అందరి ముందు, విక్కీ బయట పెడతాడు. జలజ అందరి ముందు పద్మావతిని అవమానించాలని చూస్తుంది దానికి విక్కీపద్మావతి నా ప్రాణం,తనని మీరేం అనడానికి వీల్లేదు అని చెప్తాడు. విక్కీ నాయనమ్మ అరవిందా అందరి ముందు, పద్మావతిని ఏమీ అనడానికి వీల్లేదు అని మాట్లాడి వెళ్లిపోతాడు.
ఈరోజు 374 ఎపిసోడ్ లో, పద్మావతి రూమ్ లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. వికి అందరి ముందు తనని భార్యా గా ఒప్పుకోవడం, అందరి ముందు తనని ఏమీ అనద్దు అని చెప్పడం, అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది.
విక్కీ కోపం..
పద్మావతిఆలోచిస్తూ ఉండగా అక్కడికి విక్కీ వస్తాడు. ఏంటి నేను అందరి ముందు నిన్ను భార్యగా ఒప్పుకున్నాను అని సంతోషంగా ఫీల్ అవుతున్నావా, నేను అందరి ముందు అలా అబద్ధం చెప్పాను. అది నిజం అనుకొని నువ్వు సంబరపడిపోకు, నువ్వు చేసిన పనికి నువ్వు ఎప్పటికీ నా భార్యవి కాలేవు.మీరు ఏంటో మీ మనస్తత్వం ఏంటో నాకు మొదటి నుంచి తెలుసు,మొదటి నుంచి మనం కలిసినప్పుడల్లా మీరు నన్ను, అపార్థం చేసుకున్నారు కానీ అర్థం చేసుకోలేదు.ఎందుకంటే మీకు ఇగో హర్ట్ అవుతుంది కాబట్టి, నాకు మొదటి నుంచి మీ గురించి తెలుసు, అయినా మీరు చెప్తే నేను ఎందుకు వినాలి,నేను వినను నేను పద్మావతి పద్మావతి ఇక్కడతగ్గేదే లేదు అసలు అని అంటుంది.
అను ని పుట్టింటికి, తీసుకువెళ్తానన్న భక్త..
అనుకి వాళ్ళ నాన్న భక్తా ఫోన్ చేస్తారు. పెళ్లయిన తర్వాత, సాంప్రదాయం ప్రకారం పుట్టింటికి తీసుకురావాలమ్మా అందుకే నేను రేపొద్దున వస్తున్నాను. నిన్ను మన ఇంటికి తీసుకెళ్లడానికి, ఈ విషయం చెబుదామని ఫోన్ చేశాను అని అంటాడు భక్త. సరే నాయన అయితే నేను రెడీగా ఉంటాను. నీ ఫోన్ పెట్టేస్తుంది అను. నన్ను ఒక్కదాన్నే తీసుకెళ్తాడా పద్మావతిని కూడా తీసుకెళ్తాడు కదా ఈ విషయం పద్మావతి తో చెప్పాలి. పద్మావతికి నాన్న ఫోన్ చేసి ఉండరు ఎందుకంటే తనతో మాట్లాడట్లేదు కాబట్టి. నేనే పద్మావతి చెప్తాను అని రూమ్ దగ్గరికి వెళుతుంది. అప్పటికే పద్మావతి విక్కీ గొడవ పడుతూ ఉంటారు. అనువచ్చి డోర్ కొడుతుంది.విక్కీ డోర్ తీసి, నువ్వు పద్మావతి మాట్లాడడానికి వచ్చావా సరే మాట్లాడు అని అక్కడ నుంచి వెళ్తాడు. అను పద్మావతి తో నాయన వస్తున్నాడు రేపు ఉదయం నన్ను తీసుకెళ్లడానికి, నువ్వు కూడా రెడీగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతుంది.
పద్మావతి సంతోషం..
పద్మావతి నాయన వస్తున్నాడా అయితే నా మీద కోపం తగ్గిపోయినట్టేగా, అమ్మానాన్నని క్షమించమని అడిగేస్తాను ఇక నాకు ఏ బాధలు ఉండవు. వాళ్ళిద్దరూ నాతో మాట్లాడితే నాకు అంతే చాలు అని అనుకుంటుంది. పద్మావతి ఉదయం అను టీ పెడుతూ ఉండగా అక్కడికి వచ్చి అక్క ఈరోజు కదా నాయన వచ్చేది అని అడుగుతుంది. ఏం సమాధానం చెప్పకుండా అను అట్లానే చూస్తూ ఉంటుంది. అమ్మ నాయన ఇద్దరు వస్తున్నారా లేకపోతే నాయనొక్కడే వస్తున్నాడా అత్త కూడా వస్తుందా, నాతో వస్తే ఏదో ఒక గొడవ జరుగుతుంది వద్దులే నాయన అమ్మ వస్తే నేను వాళ్ళతో మాట్లాడి చాలా రోజులైంది. ఒకటే గుర్తొస్తున్నారు వాళ్ళు ఒకసారైనా వాళ్ళని చూడాలనిపిస్తుంది రోజు నాయనతో కబుర్లు చెప్పాలనిపిస్తుంది. రోజు వాళ్ళు రాంగానే అవన్నీ తీరిపోతాయి నాకు అని అంటుంది. చాలా సంతోషంగా ఎక్సైటింగ్ గా మాట్లాడుతూ ఉంటుంది కానీ అను మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది.
పద్మావతి తో ప్రేమగా మాట్లాడిన అను..
ఏంటి అక్క నేను ఎంత మాట్లాడుతున్నానో సైలెంట్ గా ఉన్నావు.నువ్వు కూడా అందరిలాగా నన్ను ద్వేషిస్తున్నావా,మాట్లాడక్క ఒక్కరోజు మాట్లాడకపోయినా నువ్వు ఉండలేని దానివి,ఇప్పుడు ఇన్ని రోజులైనా కానీ సైలెంట్ గా ఉంటున్నావు నా మనసు ఎంత బాధ పడుతుందో నువ్వు అర్థం చేసుకున్నావా,అత్త లాగా నువ్వు కూడా నన్ను అనాధ లా చూస్తున్నావా, అని అనగానే అని ఒక్కసారిగా వెనక్కి తిరిగి అలా మాట్లాడటకు అని అంటుంది. నువ్వు ఎప్పటికీ అనాధవి కాదు నీకు ఈ అక్క ఉన్నది. ఎప్పటికీ ఉంటుంది అని అంటుంది. నాయనా అమ్మ కూడా నీ మీద కోపం లేదు. వాళ్లు నువ్వు చేసిన పని చెప్పడం లేదు అందుకే వాళ్ళు కోప్పడుతున్నారు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు నాతోనైనా చెప్పు మీ ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నావు. అని చాలా ప్రేమగా అడుగుతుంది అను. నేను ఈ విషయం చెప్తే మీరు తట్టుకోలేరు అక్క ఈ బాధ నా ఒక్కదానిలోనే ఉండాలి మీ అందరికీ పంచలేను. అది నువ్వు అనుకుంటున్నావా మీ చెప్పకపోవడం వల్లే అందరూ నీకు దూరం అవుతున్నారు అది నీకెందుకు అర్థం కావట్లేదు అని అంటుంది అను.ఇప్పుడు నువ్వు చెప్తేనే అందరూ నీకు దగ్గరవుతారు. అని ఎంత బతిమిలాడినా పద్మావతి చెప్పదు. సరే అమ్మి నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు ఇకమీదట మన మధ్య మాటలే కాదు మౌనం కూడా ఉండదు. అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అను ని తీసుకు వెళ్లడానికి వచ్చిన భక్త..
భక్తా లోపలికి వస్తూనే,పద్మావతి వికీ పెళ్లి చేసుకుని గడప దాటడం గుర్తుకు వస్తుంది. వాళ్లు పెళ్లిలో చేసిన గొడవ అన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఇంట్లోకి వస్తాడు. ఎదురుగా సిద్దు వచ్చి పలకరిస్తాడు. ఏంటి అంకుల్ ఇంత లగేజీ తీసుకొచ్చారు అని అడుగుతాడు. పుట్టింటి వాళ్లం కదా బాబు తీసుకురావాలి అని అంటాడు. ఇవన్నీ అను కోసం తీసుకొచ్చాను. పిల్ల పెళ్లి చేసి పంపించిన తర్వాత సాంప్రదాయంగా తీసుకురావాల్సినవి కొన్ని ఉంటాయి ఏదో మా స్థాయికి తగ్గట్టు తీసుకొచ్చాను. అని భక్త అంటాడు. ఎంత తీసుకొచ్చారు అన్నది కాదు అంకుల్ మీరు ఎంత ప్రేమగా తెచ్చారు అన్నది ముఖ్యం అని అంటాడు సిద్దు. బాగా చెప్పావు బాబు అని లోపలికి వస్తాడు. అందరినీ పిలుస్తాడు సిద్దు. అందరూ చూసి బక్త ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అను వచ్చి నాయనా ఎట్లా ఉన్నావు అని అడుగుతుంది. శాంతాదేవి మీరు రావడం చాలా సంతోషంగా ఉండండి అని అంటుంది. పెళ్లి చేసి పంపించిన తర్వాత సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి కదండీ అందుకే అనుని తీసుకు వెళ్దామని వచ్చాను అని అంటాడు. అను ఎలా ఉన్నావు తల్లి అని అడుగుతాడు. నేను బాగున్నాను ఆయన మీరంతా ఎలా ఉన్నారు అంటే ఏదో ఉన్నాం లేమ్మా అని అంటాడు. ఇక భక్త అనుని తీసుకెళ్లడానికి శాంతాదేవిని అడుగుతాడు.ముందు మీరు కూర్చోండి కాఫీ తాగిన తర్వాత మాట్లాడుకుందాం అని అంటుంది. సరే అని భక్త కూర్చుంటాడు అను కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది.
పద్మావతి తండ్రి మీద ప్రేమ..
సిద్దు వచ్చి పద్మావతి ఒకటే రూమ్లో కూర్చుని ఉండగా నీకు ఒక సంతోషకరమైన విషయం చెప్తాను అని అంటాడు. ఏంటో చెప్పండి అని అంటుంది. మీరే గెస్ చేయాలి అని అంటాడు నేను గెస్ట్ చేయలేను మీరే చెప్పండి అని అనగా, సిద్దు మీ నాన్న వచ్చాడు అని అంటాడు. అవునా మా నాన్న వచ్చారా? ఎప్పుడొచ్చాడు అని అంటుంది. ఇప్పుడే వచ్చారు కింద హాల్లో వెయిట్ చేస్తున్నారు అని అంటాడు. నాది ఒకసారిగా కిందకి వెళ్లి వాళ్ళ నాన్నని చూసి పెద్దగా నాయన అని దగ్గరికి వెళ్తుంది. భర్త మాత్రం పద్మావతి మొహం కూడా చూడకుండా పక్కకు తిరుగుతాడు. నాయన ఎలా ఉన్నావు అమ్మ ఎలా ఉంది అత్త ఎలా ఉన్నది మీరంతా బాగున్నారా, నాతో ఇంకా కోపం పోలేదా మాట్లాడవా అని అడుగుతుంది. అయినా నా గురించి నీకు తెలుసు కదా నాయన నువ్వు లేకుండా నేను ఉండలేను నీతో మాట్లాడకుండా నేను ఉండలేను. అసలు నువ్వు వస్తున్నావ్ అన్న సంతోషంలో నాకేం చేయాలో కూడా అర్థం కాలేదు. నువ్వు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒకసారి నాతో మాట్లాడు నాయనా నేను చేసిన దానికి నన్ను క్షమించు అని అడుగుతుంది. అయినా భక్త ఏమీ మాట్లాడడు. అందరి ముందు పద్మావతి మా నాయన వచ్చాడు నన్ను తీసుకెళ్లడానికి వచ్చాడు నేను ఇప్పుడే వస్తాను అని పైకెళ్ళి బట్టలు సర్దుకొని రావడానికి వెళ్తుంది.
రేపటి ఎపిసోడ్ లో,పద్మావతి బ్యాగ్ సర్దుకొని కిందకి వస్తుంది.అప్పటికేఅను నీ భక్త తీసుకొని వెళ్ళిపోతాడు. అరవింద్ గారు మా నాయన ఏడి అని అడుగుతుంది. అందరూ సైలెంట్ గా ఉంటారు. అక్క తొందరగా రా టైం అవుతుంది వెళ్దాం అని అంటుంది. కానీ అను మాట వినపడదు. శాంతాదేవి మీ నాయన అనుని తీసుకొని వెళ్ళిపోయాడు అమ్మ అని అంటుంది. ఒకసారి గా షాక్ అవుతుంది పద్మావతి. సిద్దు ఎంత చెప్పినా వినలేదు పద్దు, తీసుకొని వెళ్ళిపోయాడు అని అంటాడు. మావతి చాలా బాధగా బ్యాగ్ కింద పడేసి ఏడుస్తుంది. పద్మావతిని చూసి విక్కీ కూడా బాధపడతాడు..
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!