ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్లోనూ వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతున్న నేషనల్ రష్మిక మందన్నా.. త్వరలోనే `గుడ్ బై` మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతోంది. బాలీవుడ్లో విడుదల కాబోతున్న రష్మిక తొలి చిత్రమిది. వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలను పోషించారు.
అక్టోబర్ 7న ఈ చిత్రం గ్రాండ్గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో రష్మిక బిజీ బిజీగా గడుపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమెకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. అదేమిటంటే `మీ స్వయంవరం లో ఎవరెవరు ఉండాలని మీరు కోరుకుంటున్నారు..?` అని ప్రశ్నించగా అందుకు రష్మిక క్రేజీ ఆన్సర్ ఇచ్చింది.
తన స్వయంవరానికి రణబీర్ కపూర్, విజయ్ దళపతి, అల్లు అర్జున్ రావాలని రష్మిక వెల్లడించింది. ఈ ముగ్గురు హీరోలతో ప్రస్తుతం రష్మిక సినిమాలు చేస్తుంది. అందుకే ఆ ముగ్గురు హీరోలు తన స్వయంవరం లో ఉండాలని కోరుకుంటున్నట్లు రష్మిక పేర్కొంది. దీంతో రష్మిక కామెంట్స్ నెట్టింట వైరల్గా మారియి.
కాగా, తెలుగులో అల్లు అర్జున్ సరసన `పుష్ప 2`, తమిళంలో విజయ్ దళపతికి జోడీగా `వరిసు` చిత్రాలు చేస్తున్న రష్మిక.. బాలీవుడ్లో రణబీర్ కపూర్తో కలిసి `యానిమల్` అనే మూవీ చేస్తోంది. ఈ మూడు సినిమాలు ఇప్పుడు సెట్స్ మీదే ఉన్నాయి.
https://newsorbit.com/cinema/mahesh-fans-are-serious-about-rashmikas-post.html
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!