RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `ఆర్సీ 15`. శ్రీ వెంకటేశ్వర క్రియేన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంటే.. అంజలి, నవీన్ చంద్ర, జయరామ్, సునీల్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్తో గత ఏడాదే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. దాదాపు అరవై శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మిగిలిన పార్ట్ను సైతం మేకర్స్ చకచకగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇకపోతే ఈ మూవీ క్లైమాక్స్ బడ్జెట్ కి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. దాని ప్రకారం.. ఈ సినిమా క్లైమాక్స్ ను వేరె లెవల్లో ప్లాన్ చేశారట. అందుకోసం నిర్మాతలు ఏకంగా రూ. 20 కోట్లు ఖర్చు పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది.
దీంతో నెటిజన్లు క్లైమాక్స్ కే ఇరవై కోట్లా..? అంటూ కళ్లు తేలేస్తున్నారు. కాగా, పొలిటికల్ బ్యాక్డ్రాప్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే `సర్కారోడు`, `అధికారి`, `సిటిజన్` అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!