Samyuktha Menon: సంయుక్త మీనన్.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మలయాళంకు చెందిన ఈ ముద్దుగుమ్మ `భీమ్లా నాయక్` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ఇది.
మలయాళ సూపర్ హిట్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`కు రీమేక్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రానాకు జోడీగా నటించింది. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో పాటు సంయుక్తకు నటన పరంగా మంచి మార్కులు కూడా పడ్డాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ధనుష్ సరసన `సార్`, కళ్యాణ్ రామ్ తో `బింబిసారా` చిత్రాలు చేస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక తాజాగా ఈ బ్యూటీని మరో బంపర్ ఆఫర్ వరించింది. ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించిన `వినోదాయ సితం`. గత ఏడాది విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో ఇప్పుడీ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సంయుక్త మీనన్ను హీరోయిన్గా ఎంపిక చేశారట. సాయి ధరమ్ తేజ్కు జోడీగా ఆమె కనిపించబోతోందని.. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని అంటున్నారు. అంతేకాదు, సంయుక్తను పవన్ స్వయంగా రికమండ్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!