Samantha: హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2011లో “ఏ మాయ చేశావే”తో… హీరోయిన్ గా మొదటి హిట్ అందుకున్న సమంత తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఒక తెలుగులో మాత్రమే కాదు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరోలతో నటించింది. తెలుగులో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో పాటు చాలామంది టాప్ హీరోలతో నటించింది. అనంతరం 2017 లో అక్కినేని నాగచైతన్యనీ ప్రేమించి పెళ్లాడింది. అయితే పెళ్లి చేసుకున్న నాలుగు సంవత్సరాలకే 2021లో ఇద్దరు విడిపోవడం జరిగింది.
ఆ తర్వాత 2022వ సంవత్సరంలో మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడటం జరిగింది. దీంతో దాదాపు నాలుగు నుంచి ఏడు నెలల వరకు సినిమా ఇండస్ట్రీకి దూరమై బెడ్ కే పరిమితం కావడం జరిగింది. ఆ తర్వాత గత ఏడాది మార్చి నెలలో కోలుకొని ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేసింది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండతో “ఖుషి” సినిమాతో విజయం సాధించింది. ఈ సినిమా గత ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదల అయింది. సినిమా విజయం సాధించాక సమంత విదేశాలకు వెళ్లిపోవడం జరిగింది. మరలా నవంబర్ నెలలో తిరిగి హైదరాబాదు చేరుకున్న సమంత ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఉంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన యొక్క విషయాలను సోషల్ మీడియాలో తెలియజేస్తూ రకరకాల పోస్టులు పెడుతుంది.
తాజాగా సమంత పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో తాను ఎమర్జెన్సీ రూమ్ హాస్పిటల్ కి వెళ్ళటానికి గల కారణం ఏంటో తెలియజేసింది. ఆ పోస్టులో ఎవరికైనా పువ్వులు అనేవి ఇష్టం ఉంటుంది. కానీ నా విషయానికొచ్చేసరికి పువ్వులు అంటే చాలా ఎలర్జీ. గతంలో ఆ పువ్వులు వల్లే నేను ఎమర్జెన్సీ రూమ్ కి వెళ్లాల్సి వచ్చింది. మళ్లీ చాలా రోజుల తర్వాత పువ్వులు దగ్గరికి రావడం జరిగింది. కానీ ఇవి నన్ను చాలా భయాందోళనకు గురి చేస్తున్నాయి. అందమైన వస్తువులు చూసినప్పుడు ఎన్నో భావాలను పంచుకుంటారు. కానీ నేను పువ్వులు చూసి చాలా భయపడుతున్నాను. పువ్వులతో నరకం అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది అంటూ సమంత…పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతోంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!