గత ఏడాది అక్టోబర్ రెండవ తారీకు సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడం తెలిసిందే. దాదాపు నాలుగు సంవత్సరాల వివాహ జీవితానికి స్వస్తి పలికి ఇద్దరు ఒక్కసారిగా విడాకులు తీసుకోవడం అందరికీ షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఏ కారణంగా వీరిద్దరు విడిపోయారు అన్నది ఎవరికి అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. సాక్షాత్తు నాగచైతన్య తండ్రి నాగార్జున సైతం వాళ్ళిద్దరు విడిపోవడం పట్ల కారణం ఏంటో కూడా చెప్పలేకపోయారు. ఎన్నో సంవత్సరాలు ప్రేమించుకుని కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. విడిపోవడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే ఈ విషయంపై మొన్నటి వరకు అటు నాగచైతన్య లేదా ఇటు సమంత కూడా ఎవరూ మాట్లాడలేదు. కానీ తాజాగా సమంత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షో “కాఫీ విత్ కరణ్” లో మాట్లాడటం జరిగింది.
నాగచైతన్యతో విడాకులు సామరస్యంగా జరగలేదని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య కి దూరమయ్యాక.. జీవితం చాలా కష్టమని అనిపించినట్లు సమంత అంగీకరించింది. అయితే అప్పుడు నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. విడాకుల తర్వాత ఇద్దరం కూడా చాలా మనోవేదనకు గురయ్యం. అయితే విడాకులు నీ భర్త నుండి తీసుకోవడానికి మీరే కారణం అని కరణ్ … ప్రశ్నిస్తున్న క్రమంలో సమంత కలుగజేసుకొని మాజీ భర్త అనాలి అంటూ సంబోధించింది.
ఈ క్రమంలో కరణ్ సారీ చెబుతూ…మీ మాజీ భర్త, మీరు విడిపోయినప్పుడు మీరే కారణమంటూ ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిందని మీరు భావించారా అని ప్రశ్నించారు.. సమంత బదులిస్తూ.. అవును కానీ దాని గురించి నేను ఫిర్యాదు చేయలేను. ఎందుకంటే ఆ టైంలో నేను ప్రశాంతంగా ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఒకవేళ ఆ టైంలో స్పందించాలని భావించిన గాని నా దగ్గర ఆధారాలు లేవు. నాగచైతన్య నుండి విడిపోయే టైంలో 250 కోట్ల రూపాయల మరణం కూడా తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అదే మీడియా అది ఎంత పుకారో గ్రహించినప్పుడు… పుకార్లు వాటంతటావే ఆగిపోయాయి. ఈ రీతిగా చాలా కాలం తర్వాత ఎట్టకేలకు నాగ చైతన్యతో విడాకులు గురించి సమంత కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!