Guntur Kaaram: టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి అందరికీ సుపరిచితుడే. తెలుగులో ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు. దర్శకుడిగా మాత్రమే కాకుండా హీరోగా కూడా పలు సినిమాలు చేయడం జరిగింది. అటువంటి ఎస్వీ కృష్ణారెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు “గుంటూరు కారం” సినిమా ఫలితం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు కారం సినిమా హీరో స్టార్ డామ్ కి అనుకూలంగా తీయడానికి తంటాలు పడటంతో ఫలితం తేడా కొట్టింది. ఎప్పుడైనా కథని నమ్ముకునే సినిమాని చేయాలి అని అన్నారు. ఇదే సమయంలో సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ తో మనస్పర్ధలు అంటూ వచ్చిన వార్తలపై కూడా స్పందించారు.
ఈ వార్తలు వచ్చి చాలా కాలమైనా అప్పట్లో రాజేంద్రప్రసాద్ లేదా కృష్ణారెడ్డి ఎవరు స్పందించలేదు. కానీ రీసెంట్ ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణారెడ్డి మాయలోడు అనే సినిమా రాజేంద్రప్రసాద్ తో చేస్తున్న సమయంలో సౌందర్య స్టార్ హీరోయిన్. అప్పటికే ఆమె కాల్ షీట్స్ దొరకటం చాలా కష్టం. అలాంటి సమయంలో తన కాల్ షీట్స్ నాకు ఇవ్వటం జరిగింది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది చినుకు చినుకు అందెలతో అనే పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇక సౌందర్య కాల్ షీట్ దొరకగానే రాజేంద్రప్రసాద్ కి ఫోన్ చేసి సౌందర్య డేట్స్ దొరికాయి మీరు కూడా వచ్చేస్తే పాట షూటింగ్ పూర్తి చేద్దామని అన్నాను. దాంతో ఆయన ఆమె డేట్స్ కు నా డేట్స్ అడ్జస్ట్ చేయాలో అంటూ కాస్త ఈగో ఫీల్ అయ్యారు.
అప్పటినుంచి రాజేంద్రప్రసాద్ కి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వరు షూటింగ్ కి రమ్మంటే రారు. దీంతో ఈ వివాదం అలా సాగుతుండగా నేను బాబు మోహన్ తో చేయాలని డిసైడ్ అయ్యా. ఇందుకు సౌందర్య కూడా ఓకే చెప్పటంతో వెంటనే చేయడం జరిగింది. ఆ సమయంలో బాబు మోహన్ తో సౌందర్య డాన్స్ చేయటం ఏంటి అని ఇండస్ట్రీలో రకరకాల చర్చలు జరిగాయి. కానీ ప్రేక్షకులు ఈ పాట కోసమే థియేటర్లోకి వచ్చి సినిమాని హిట్ చేశారు అంటూ ఎస్ వి కృష్ణారెడ్డి కీలక కామెంట్స్ చేశారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!