NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YCP MP Vijaya Sai Reddy: కాంగ్రెస్ పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయి సంచలన వ్యాఖ్యలు

YCP MP Vijaya Sai Reddy: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చి పీసీసీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పీసీసీ పగ్గాలు చేపట్టింది మొదలు అధికార వైసీపీని, సోదరుడు వైఎస్ జగన్ పైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూనే ఉన్నారు.

జగన్ హయాంలో ఏపీలో అభివృద్ధి జరగలేదని, ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని, కేంద్రంలోని బీజేపీకి గులాంగిరి చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో షర్మిల వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. కుటుంబాలను చీల్చి కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తుందని స్వయంగా సీఎం జగన్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలోనూ వైఎస్ షర్మిలను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు వైసీపీ సానుభూతపరులు.

ఈ క్రమంలో తాజాగా వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంలో ..ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం ఏనాడూ లేదని, ఇప్పుడు దాన్నొక ఒక ఎన్నికల ఆంశంగా మార్చాలని చూస్తున్నారని అన్నారు.

ఏపీపై కాంగ్రెస్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా చేర్చడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యిందని అన్నారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి బాగా అలవాటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ దుష్టపరిపాలన కు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రం అని అన్నారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరని అన్నారు.

గత ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. నీతి లేని రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశంలో కనుమరుగు కావడం ఖాయమని అన్నారు. 2029 లో కూడా తాను ఎంపిగా ఉంటాననీ, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం 2029లో ఒక్క ఎంపీ కూడా ఉండరని విజయసాయి జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు.

YS Viveka Case: సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ మరో సారి వాయిదా

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju