Madhuranagarilo February 5 2024 Episode 279: పెన్ను తీసి శ్యామ్ కాళ్ళకి దండం పెడుతుంది రాధా. అక్షంతలు వేసి ఆశీర్వదించి,థాంక్యూ రాధా గుడికి వెళ్దాం పద అని శ్యామ్ అంటాడు. పదండి నేను కూడా వస్తాను అని రుక్మిణి అంటుంది. నువ్వెందుకు పెద్దమ్మ అమ్మ బర్త్డే కదా అని పండు అంటాడు. పండు అలా అనకూడదు పెద్దమ్మ కూడా అమ్మలాంటిదే అని రాదా అంటుంది. అమ్మలాంటిది కానీ అమ్మ కాదు అని పండు అంటాడు. శభాష్ రా పండు బాగా చెప్పావు అని శ్యామ్ అంటాడు. పండు నువ్వు ఎందుకు గుడికి వెళుతున్నావు అని రుక్మిణి అడుగుతుంది. అమ్మ పుట్టినరోజు కాబట్టి కొడుకుగా నేను వెళ్తున్నాను అని పండు అంటాడు. మా చెల్లెలు పుట్టిన రోజు కాబట్టి అక్కగా నేను వెళ్తున్నాను అని రుక్మిణి అంటుంది. సరే తొందరగా వెళ్లి రండి సాయంత్రంపార్టీ ఉంది అని మధుర అంటుంది.
పండు రాధా వెళ్లి కారులో కూర్చుంటారు. ఏంటి రాద ఇంట్లో నుంచి వెళ్ళిపోదని అనుకుంటున్నావా అని రుక్మిణి అంటుంది. వెళ్ళిపోతుందని నువ్వు అనుకుంటున్నావా రాద కచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్ళదు అని శ్యామ్ వెళ్లి కార్లో కూర్చుంటాడు. కట్ చేస్తే, వాళ్లందరూ గుడికి వెళ్తారు. రాధా పండు రుక్మిణి శ్యామ్ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. పండు ముందు నడుస్తాడు రాధా శ్యామ్ పక్కపక్కన నడుస్తూ ఉంటారు రుక్మిణి వాళ్ళ వెనకాల వస్తుంది. వాళ్ళిద్దరూ పక్కపక్క న అడగడం చూసినా రుక్మిణి పండు అని పిలుస్తుంది. మమ్మీ డాడీ పక్కన నడుస్తుంటే నువ్వు మధ్యలో ఎందుకు వచ్చావు పెద్దమ్మ అని పండు అంటాడు. నువ్వు ముందు వెళ్తున్నావ్ కదా కింద పడతావేమో అని నిన్ను పిలిచి వచ్చిందిలే అని రాదా అంటుంది. రాధా వెనుకకు నడుస్తూ ఉండగా రుక్మిణి శ్యామ్ పక్కన నడుస్తుంది. రుక్మిణికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని శామ్ పక్కన ఉన్న కొబ్బరి చిప్పని తన కాలికిందికి నెట్టుతాడు చూసుకోకుండా రుక్మిణి కాలు కొబ్బరి చిప్ప మీద వెయ్యగానే రక్తం కారుతుంది. అక్క రక్తం వస్తుంది ఇప్పుడు ఎలా ప్రదక్షిణ చేస్తావు అని రాధా అంటుంది.
ఏం పర్వాలేదు చేస్తాను అని రుక్మిణి అంటుంది. ఒక అడుగు ముందుకు వేయగానే నడవలేక బాధపడుతుంది రుక్మిణి. ఖాళీ నొప్పితో ప్రదక్షిణ చేయలేవు నువ్వు వెళ్లి పక్కన కూర్చో మేము ప్రదక్షిణ చేసి వస్తాం అని రాదా అంటుంది. రుక్మిణి వెళ్లి పక్కన కూర్చుంటుంది శ్యామ్ రాధా పండు ప్రదక్షణ చేసి వస్తారు. పంతులు వచ్చి గోత్రం చెప్పండమ్మా అని అంటాడు. రుక్మిణి వాళ్ళ పుట్టింటి వాళ్ళ గోత్రం చెబుతుంది. పంతులుగారు పెళ్లయిన అమ్మాయికి అత్తింటి గోత్రంతో అర్చన చేస్తారు కదా అని శ్యామ్ అంటాడు. మీ అత్తింటికి గోత్రం చెప్పమ్మా అని పంతులు అంటాడు. రాధా శ్యామ్ వాళ్ళ ఇంటి పేరు చెబుతుంది. కొడుకు పేరు భర్త పేరు చెప్పమ్మా అని పంతులు అంటాడు. రాధా వాళ్ళ ముగ్గురు పేరు మీద అర్చన చేయిస్తుంది. పంతులు వాళ్ళ ముగ్గురిని ఆశీర్వదించి ప్రసాదం పెడతాడు. కట్ చేస్తే, ఒకచోట కూర్చొని ప్రసాదం తింటూ ఉంటారు నలుగురు. అక్కడ ఒక చెట్టుకి ముడుపులు కడుతూ కనిపిస్తారు ఆడవాళ్ల, వాళ్లను చూసి అలా ఎందుకు కడుతున్నారు డాడీ అని పండు అంటాడు. మనసులో కోరిక కోరుకునే ముడుపు కడితే తీరుతుంది పండు అని శ్యామ్ అంటాడు.
అయితే నేను ముడుపు కడతాను అని రాదా లేస్తుంది. నేను కూడా కడతాను అని రుక్మిణి అంటుంది. పెద్దమ్మ మా అమ్మతో పోటీ పడుతున్నావా నువ్వు పోటీపడి ముడుపు కట్టిన అమ్మ కోరిక నెరవేరుతుంది అని పండు అంటాడు. మీ అమ్మ కోరిక నెరవేరితే చాలు పండు అని రుక్మిణి అంటుంది. వాళ్ళిద్దరూ వెళ్లి ముడుపు కడుతూ ఉండగా పండు శ్యామ్ చేతులు కడుక్కుందామని లేచి వెళ్తూ ఉండగా పండు జారి కిందపడతాడు. పండు కింద పడిపోగానే రుక్మిణి రాదా ముడుపులు వదిలేసి పండు దగ్గరికి పరిగెత్తుకొస్తారు. పండు నీకు దెబ్బ తగలలేదు కదా అని రాదా అంటుంది. లేదమ్మా మీ రెండు మూడు పూలు కింద పడిపోయాయి అంటే మీ కోరికలు నెరవేరవు అని పండు అంటాడు. ఏం కోరుకున్నావు రాధా అని శ్యామ్ అంటాడు.
మీరిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలని కోరుకున్నాను అని రాదా అంటుంది. కట్ చేస్తే, రాధా సాయంత్రం కేక్ పార్టీ అయిపోయిన తర్వాత ఇంట్లో నుంచి వెళుతుంది అంటావా దాక్షాయిని అని చలపతి అంటాడు. ఏమో నండి చూద్దాం గుడికి వెళ్లారు కదా రానివ్వండి అని దాక్షాయిని అంటుంది. ఇంతలో డెలివరీ బాయ్ వచ్చి కేక్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ కేక్ తీసుకువచ్చి ఇంట్లో పెడతారు చలపతి దాక్షాయిని. మా రాధా పుట్టినరోజు అత్తింట్లో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇదే చివరి పుట్టినరోజు అవుతుందనే బాధగా ఉంది అని మురళి అంటాడు.
సాయంత్రం పార్టీ అయిపోయిన తర్వాత రాదని కూర్చోబెట్టి మాట్లాడదామా బావగారు అని ధనంజయ్ అంటాడు. రాధ ఒక నిర్ణయం తీసుకుంది అంటే తప్పకుండా చేస్తుంది మనం ఎవరే ఏం చెప్పినా వినదు అని మురళి అంటాడు.రాధా మనసు మారి ఇంట్లో ఉండిపోతే ఎంత బాగుండు అని మధుర ఉంటుంది. ఇంతలో కృష్ణ వస్తుంది. రాధా వాళ్ళు ఇంట్లో లేరా ఆంటీ అని కృష్ణ అడుగుతుంది. గుడికి వెళ్లారమ్మా అని మధుర చెబుతుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!