లోకనాయకుడు కమల్ హాసన్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంతరం వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు తెరపై కనిపించకపోయినా.. మళ్లీ ఈ బ్యూటీ `క్రాక్`తో గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు వాంటెడ్ హీరోయిన్గా మారి.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది.
ఈమె ఇప్పుడు తెలుగు మూడు సినిమాలు చేస్తోంది. అందులో పాన్ ఇండియా ప్రాజెక్ట్ `సలార్` ఒకటి. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హీరోయిన్గా ఎంపిక అయింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
ఈ సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ సరసన `ఎన్బీకే 107`, మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `మెగా 154` చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇకపోతే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రుతి హాసన్.. వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు `సినీ పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువగా ఉందని మీరు అనుకుంటున్నారా?` అనే ప్రశ్న ఎదురైంది.
అందుకు ఆమె అవును అని సమాధానం ఇచ్చింది. అయితే పురుషాధిక్యత అనేతి కేవలం సినీ పరిశ్రమలోనే లేదని, సమాజం మొత్తం అలానే ఉందని చెప్పుకొచ్చింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రస్తుతం అందరం పురుషుల ఆధిపత్యం ఉన్న సమాజంలోనే జీవిస్తున్నామని, ఇది కేవలం ఇండస్ట్రీలోనే కాదు.. ఎక్కడ చూసిన పురుషుల ఆధిపత్యమే ఉంది అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ వైరల్గా మారాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!