స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తమిళ హీరో అయినప్పటికీ టాలీవుడ్లోనూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడీయన. ముఖ్యంగా ఈయన నుంచి ఆ మధ్య వచ్చిన `విజిల్`, `మాస్టర్` చిత్రాలు ఇక్కడ మంచి విజయం సాధించాయి.
ఈ నేపథ్యంలోనే ఆయన తమిళంలో చేసే ప్రతి సినిమా.. తెలుగులోనూ విడుదల అవుతుంటుంది. ప్రస్తుతం ఈయన `వరిసు(తెలుగులో వారసుడ)` మూవీతో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంగతి పక్కన పెడితే.. విజయ్ రీసెంట్గా ఓ కొత్త ఇల్లును కొనుగోలు చేశాడని తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. చెన్నైలోని ఖరీదైన ఏరియాలో ఓ అపార్ట్ మెంట్ని కొనుగోలు చేశారట.
దీని ధర తెలిస్తే మైండ్బ్లాక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఎంతో తెలుసా..? అక్షరాల రూ. 35కోట్లు అట. అన్ని సౌకర్యాలతో ఇంద్ర భవనంలా ఆ ఇల్లు ఉంటుందట. త్వరలోనే విజయ్ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేయనున్నారని అంటున్నారు. కాగా, చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్లో గల ఇంట్లో విజయ్ ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు. అయితే ఆ రోడ్లో ట్రాఫిక్ బాగా పెరిగిపోయిందట. అందుకే ప్రశాంతమైన ఏరియాలో ఆయన ఇల్లు తీసుకున్నారని టాక్ నడుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!