Trinayani December 21 2023 Episode 1116: ఉలొచ్చి నా బంగారు తల్లి వచ్చి పాలు తాగమ్మా అని నైని అంటుంది. నైని అలా పిలవగానే ఉలూచి అక్కడికి వస్తుంది.చిట్టి ఉలుచి వచ్చింది పందెం కాస్తే పాలు తాగుతుంది అని హాసిని అంటుంది. వదిన అలాంటి పందాలు కాయకూడదు అని విశాల్ అంటాడు. పందెం కాస్తేనే కదా అల్లుడు మజా ఉండేది అని పావన మూర్తి అంటాడు. సరే ఉలోచి నా మాటే వింటుంది కాబట్టి ఉలొచ్చి నువ్వు చెప్పినట్టు గ్లాసులో పాలు తాగితే నువ్వు ఒక్కరోజు చెప్పిన పని నేను చేస్తాను అని సుమన పందెం కాస్తుంది. ఇది చిట్టి సవాల్ అంటే అలా ఉండాలి అని హాసిని అంటుంది. మి సరదాలు ఏమో కానీ మాకు ఇక్కడ టెన్షన్ పెరిగిపోతుంది అని తిలోత్తమ అంటుంది. మేము పందెం కాస్తే మీకెందుకు అత్తయ్య టెన్షన్ అని నైని అంటుంది.ఉలోచి నేను తెచ్చిన పాలు తాగమ్మా అని సుమన అంటుంది. ఉలోచి పాలు తాగకుండా అలాగే నిలబడి చూస్తుంది. నువ్వు చెప్పితే తాగదు కానీ నైనిమ్మ నువ్వు చెప్పు పాలు తాగుతుంది అని పావన మూర్తి అంటాడు.
కన్నది నేనైతే మా అక్క మాట ఎలా వింటుంది ఉలోచి అని సుమన అంటుంది. ఉలూచి గ్లాసులో పాలు కాకుండా మీ అమ్మ తెచ్చిన పాలు తాగమ్మ అని వల్లభా అంటాడు. ఉలిచి నా బంగారు తల్లి గ్లాసులో పాలు తాగమ్మా నా మాట వింటావు కదూ నీకు ఏ పాలు ఇష్టమైతే ఆ పాలు తాగు అని నైని అంటుంది. నైని అలా అనగానే ఉలొచ్చి గ్లాసులో పాలు తాగేస్తుంది. అందరూ చప్పట్లు కొడతారు. నైనీ చెల్లి గెలిచింది అని హాసిని అంటుంది. సుమన కళ్ళు ఎర్రవి చేసి కోపంగా చూస్తూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, సుమన కోపంతో తన గదిలో సామాన్లు ఎత్తేస్తుంది. ఇంతలో విక్రాంత్ వచ్చి నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అంటాడు. నా మీద మా అక్క గెలిచిందని అందరూ సంబరపడుతున్నారు కదా కన్నది నేనైతే మా అక్క మాట అలా వినింది ఉలచి అని ఉయ్యాలను తంతుంది సుమన. పిల్లల్ని ప్రేమగా పిలిస్తే ఎవరైనా చెప్పిన మాట వింటారు కానీ ఉలొచ్చి ఉయ్యాలని ఎందుకే తంతావ్ అని విక్రాంత్ అంటాడు. మా అక్క మాట వింటది అని తెలిస్తే అసలు దీన్ని కనే దాన్ని కాదు అని సుమన కోపంతో అంటుంది. ఇంతలో హాసిని వచ్చి చెల్లి ఏదో సరదా కోసం అలా పందెం కాచి గెలిస్తే ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావ్ అని హాసిని అంటుంది.
సరదా కోసం పందెం అలా కాయడం ఏంటి అక్క అని సుమన అంటుంది. సుమన ఏదో సరదా కోసం చేశాను కానీ నీ మీద గెలవడం కాదు అని నైని అంటుంది. నువ్వు చెప్పిన నట్టు వినాల్ చేస్తుందని చిట్టి ఇలా ప్రవర్తిస్తుంది చెల్లి అని హాసిని అంటుంది.అయినా నేనేమన్నా ఆ గిన్నెలో విషం పాలు తెచ్చి పెట్టానా ప్రేమగా పాలు తెచ్చి పెడితే అవి తాగకుండా నీవు తెచ్చిన పాలు తాగింది అని సుమన అంటుంది.గ్లాసు పాలల్లోనే విషం ఉంది అని నైని అంటుంది.చెల్లి ఎవరితో ఏం చెప్తున్నావు అని హాసిని అంటుంది.అదే అక్క చిన్నపిల్లలకు ఎవరైనా విషం పాలు తెచ్చి పెడతారా ప్రేమగా తెచ్చి పాలు పెట్టాము తాగింది అని నైని అంటుంది. వదిన అది అలాగే ఉంటుంది కానీ మీరు ఇక వెళ్ళండి అని విక్రాంత్ అంటాడు. కట్ చేస్తే, ఎద్దులయ్య హాల్లో కూర్చుని జపం చేసుకుంటూ ఉంటాడు. ఏంటి ఎద్దులయ్య చాప వేసుకుని జపం చేయకుండా తాడు వేసుకొని కూర్చున్నావు అని హాసిని అంటుంది. ఇది తాడు కాదు మాత పాశం అని ఎదులయ్య అంటాడు. ఏ పాశం బెల్లం వేసి వండుతారే ఆపశమా అని ఎగతాళి చేస్తాడు వల్లభ. నువ్వు మీ అమ్మ ఎప్పుడు తిండి గురించే ఆలోచిస్తూ ఉంటారా అని హాసిని అంటుంది. మా దగ్గర కండబలం ఉంది కండగలవాడే మనిషి నీ దగ్గరేముందే అని వల్లభ అంటాడు. నా దగ్గర గుండె బలం ఉంది అని హాసిని అంటుంది. ఇది ఆపశం కాదు వల్లభ కోరలు పెంచుకొని మనుషుల ప్రాణాలు తీసే యమపాశం అని ఎద్దులయ్య అంటాడు.
అర్థమైంది ఎద్దులయ్య రేపు రాబోయేది కోర్ల పున్నమి కోరలమ్మకి పూజ చేయాలి అప్పుడే అందరికీ దండాలు తొలగిపోతాయి అని నైని అంటుంది. ఈ కోరలమ్మ ఎవరు చెల్లి కొత్తగా అని హాసిని అంటుంది. ఆవిడ యమోధర్మరాజుకి చెల్లెలు అక్క మన వెంట ఉండి మన చేసిన తప్పులన్నీ లెక్కపెట్టి చిత్రగుప్తులకి చెప్తుంది అందుకే ఈ కొర్ల పునానికి మినుములతో రొట్టెలు చేసి వాటి నీ నైవేద్యం పెట్టి కుక్కలకు వేయాలి అక్క అలా ఆమెను పూజిస్తే ఎలాంటి ఆపదలు కలగవు అని అంటుంది. యమధర్మరాజుకి చెల్లెలు కూడా ఉందా అమ్మ అని పావన మూర్తి అంటాడు. ఏంటి బాబాయ్ పెళ్లి చేసుకుంటావా అని హాసిని అంటుంది. నన్ను చేసుకునే ఏమీ చేయలేకపోయాడు మీ బాబాయ్ ఇక అమ్మాయిని చేసుకుని ఏం చేస్తాడు అని దురంధర అంటుంది. సరే ఇప్పుడు అదంతా ఎందుకు పూజకు ఏర్పాటు చేయండి అని దురంధర అంటుంది.
కట్ చేస్తే, ఏమండోయ్ ఇది విన్నారా అని సుమన అంటుంది. ఎవరైనా పాడారా అని ఈక్రాంత్ అంటాడు. మీరు వేసే జోకులకు నాకు నవ్వు రాదు కానీ మీ వదిన గారు మళ్లీ ఏదో పూజ చేస్తుందంట ఎవరో పాడెక్కుతారంట అని సుమన అంటుంది. నువ్వు పోతే నాకు దరిద్రం వదులుతుంది అని విక్రాంత్ అంటాడు. ఈ మాట కూడా నాకు నవ్వు రాలేదు కానీ ఇలా ఎన్ని పూజలు చేసి ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటావు వదినా అని నిలదీయవా అని సుమన అంటుంది. నీలాంటి ఆడవాళ్లు ఉంటే మగాడు రెచ్చిపోయి ప్రతి రోజు గొడవలు తెస్తాడు అని విక్రాంత్ అంటాడు. ఇంతలో ఎద్దులయ్య వచ్చి సుమనమ్మ నేను లోపలికి వస్తాను అని అంటాడు. ఎవరైనా లోపలికి రావచ్చా అంటారు నువ్వేంటి వస్తాను అంటున్నావ్ అని సుమన అంటుంది.
ఏమీ లేదమ్మా నా పాశం ఇక్కడ మంచం కింద చేరింది దాన్ని తీసుకువెళ్లి పూజ చేసి శాంతింప చేయాలి అంటూ వెళ్లిపోతాడు ఎద్దులయ్య. తాడును పట్టుకొని పాశం అంటారేంటి అని సుమన అంటుంది. అది నీ మంచం కిందికి వచ్చి చేరింది అంటే నువ్వు కన్ను శాశ్వతంగా మూస్తావేమో చూడు అని విక్రాంత్ అంటాడు. నేను అంత తొందరగా ఏమి ఫోను లేండి అని సుమన అంటుంది.కట్ చేస్తే, నైనీ హాసిని కూరల దేవికి పూజ చేయడానికి అన్ని సిద్ధం చేస్తారు.అమ్మ కలశాన్ని అప్పుడే పెట్టకండి ఈ పాశం పెట్టిన తర్వాత పెట్టండి అని ఎద్దులయ్య అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది