Pallavi Prasanth: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా గెలిచిన పల్లవి ప్రశాంత్ ఆనందం.. కొద్ది క్షణాలకే ఆవిరైపోయింది. డిసెంబర్ 17వ తారీకు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ముగిసిన తర్వాత… అన్నపూర్ణ స్టూడియో బయట దాడులకు పాల్పడటం తెలిసిందే. ఈ దాడులలో చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కారులు ధ్వంసం అయ్యాయి. ముఖ్యంగా బిగ్ బాస్ రన్నర్ అమర్ కారు అయితే అద్దాలు ధ్వంసం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులపై కూడా దాడికి పాల్పడటం జరిగింది. ఇంకా అశ్విని అదేవిధంగా గీతు రాయల్ కార్లు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ దాడులలో ఎక్కువగా పల్లవి ప్రశాంత్ పేరు వినపడటంతో పాటు వద్దన్నా కొద్ది స్టూడియో బయట ర్యాలీ చేయడంతో.. కేసులు నమోదయ్యాయి.
ప్రధానంగా ఆర్టిసి బస్సు అద్దాలు ధ్వంసం కావటంతో చాలా సీరియస్ అయింది. దీంతో ప్రశాంత్ ని పోలీసులు బుధవారం అరెస్టు చేయడం జరిగింది. మొత్తం ఐదుగురిపై కేసులు నమోదయ్యాయి. ప్రధాన నిందితుడిగా ప్రశాంత్ పేరు చేర్చడం జరిగింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్ ని అతని సొంత ఊరులో అదుపులోకి తీసుకొని.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ క్రమంలో ప్రశాంత్ కి బెయిల్ ఇప్పించడానికి బిగ్ బాస్ కంటెస్టెంట్ భోలే రంగంలోకి దిగారు. అయితే అప్పటికే అదుపులోకి తీసుకొని న్యాయమూర్తి ఎదుట హాజరపరచడంతో 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకి తరలించడం జరిగింది.
భోలె తనవంతుగా ప్రశాంత్ నీ సేవ్ చేయడానికి హైకోర్టు లాయర్ తీసుకొచ్చి.. ఎలాగైనా కేసు నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇదే సమయంలో అశ్విని కూడా ప్రశాంత్ అరెస్టు చేయటాని అందించారు. ఎవరో చేసిన దానికి ప్రశాంత్ నీ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని వీడియో చేయడం జరిగింది. అయితే ప్రభుత్వ ఆస్తులపై దాడుల నేపథ్యంలో ఈ కేసు నాన్ బైయిలబుల్ అని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ అరెస్టు కావటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.