అల్లు శిరీష్ నటుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. కానీ కెరీర్ ఆరంభం నుంచి ఈయనకు సరైన హిట్టే పడలేదు. ప్రస్తుతం ఈయన `ఊర్వశివో రాక్షసివో` అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు.
అను ఇమాన్యుయెల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహించాడు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమాపై ఇటు అల్లు శిరీష్ అటు అను ఇమాన్యుయెల్ ఇద్దరూ భారీ ఆశలు పెట్టుకున్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ జంట.. ఊర్వశివో రాక్షసి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆరాటపడుతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా సాలిడ్ బిజినెస్ జరిగింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కలిపి రూ. 7 కోట్ల రేంజ్ లో ఈ సినిమా థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేశారని తెలుస్తుంది. ఈ లెక్కన అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివోతో హిట్ కొట్టాలంటే రూ. 7.5 కోట్ల రేంజ్ లో షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. మరి అల్లు శిరీష్ టార్గెట్ ను రీచ్ అవుతాడో లేదో తెలియాలంటే రేపు సినిమా టాక్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
https://newsorbit.com/entertainment-news/urvasivo-rakshasivo-teaser-out-now.html
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!