Samantha: హీరోయిన్ సమంత మయోసిటీస్ అనే ప్రాణాంతకర వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. నిన్న తనకి ఈ వ్యాధి వచ్చినట్లు సమంత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇండస్ట్రీ వర్గాలు మరియు అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలని భగవంతుని వేడుకుంటున్నారు. మరో పక్క సమంత హార్ట్ కోర్ ఫ్యాన్స్… ఇంకా తేడాది ఇదే అక్టోబర్ నెలలో విడాకులు మళ్లీ ఈ ఏడాది అక్టోబర్లో ఈ ప్రాణాంతకర వ్యాధి.. సామ్ కి దెబ్బ మీద దెబ్బ అని అంటున్నారు. కెరియర్ పరంగా మంచి పిక్ స్టేజ్ లో ఉన్న ఈ టైంలో బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్న సమయంలో సమంత ఈ వ్యాధిన బారిన పడటం దురదృష్టం అని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే సమంత నటించిన “యశోద” నవంబర్ 11 వ తారీఖున రిలీజ్ కానుంది. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ … హీరోయిన్ సమంత గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సమంత గత 12 సంవత్సరాల నుండి నాకు బాగా తెలుసు. చెన్నైలో పరిచయం. యశోద సినిమాలో ఆమె చాలా కష్టపడింది. ఆమెది చాలా సీరియస్ రోల్. దీంతో నేను సెట్స్ కి వెళ్లిన ప్రతిసారి ఆమెను నవ్వించడానికి జోకులు వేసేదాన్ని. ఆమెను నవ్వించడానికి ప్రయత్నం చేసేదాన్ని.
అయితే ఒక్కోసారి షాట్స్ కి ముందు జోకులు వేస్తే ఎందుకు జోకులు వేస్తున్నావు అంటూ.. సరదాగా ఉండేది. సమంతాతో పనిచేయడం చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. యశోద పాత్రలో సమంత ఇట్టే ఒదిగిపోయింది. యశోద సినిమాకి స్టోరీ యే హీరో … మాదిరిగా ఉండటంతో సమంత.. అద్భుతంగా నటించింది. అంతే కదా సమంత చాలా స్ట్రాంగ్ ఉమెన్ అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!