టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు కావాల్సినంత క్రేజ్ ఉంది.. కానీ, సక్సెస్ మాత్రం వరించడం లేదు. అప్పుడెప్పుడో విడుదలైన `గీత గోవిందం` తర్వాత హిట్ ముఖమే చూడలేకపోయిన విజయ్ దేవరకొండ.. రీసెంట్గా `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.
విజయ్ కెరీర్లో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రం. పూరీ జగన్నాథ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. బాలీవుడ్ స్టర్ కిడ్ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఈ మూవీ అపజయం తర్వాత విజయ్ కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కథ నచ్చకపోతే ఎలాంటి మొహమాటం లేకుండా ఆయన చేయనని చెప్పేస్తున్నాడట. తాజాగా కూడా విజయ్ దేవరకొండకు ఓ డైరెక్టర్కు నో చెప్పాడట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. బుచ్చిబాబు సానా. `ఉప్పెన` వంటి బ్లాక్ బస్టర్ మూవీతో డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసిన బుచ్చిబాబు.. రీసెంట్గా విజయ్ వద్దకు వెళ్లి ఓ కథ వినిపించారట.
అయితే కథలో కొన్ని కొన్ని లోపాలు ఉండటం కారణంగా విజయ్ దేవరకొండ బుచ్చిబాబుకు సున్నితంగా సినిమా చేయలేనని చెప్పినట్లు తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా, విజయ్ ప్రస్తుతం సమంతతో కలిసి `ఖుషి` అనే లవ్ స్టోర్ చేస్తున్నారు. అలాగే మరోవైపు పూరీ జగన్నాథ్తో `జనగణమన` అనే సినిమా చేసేందుకు సైన్ చేశాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!