Diwali: హిందూ ధర్మం ప్రకారం ఏ పండుగలు వచ్చిన ఇంటిని, శరీరాన్ని శుభ్రపరుచుకోవాలని అనాదిగా వస్తున్న ఆచారం.. దీపావళి పండుగ చీకటిపై ములుగు సాధించిన విజయాన్ని సూచిస్తుంది.. ఈ సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన దీపావళి పండుగ వచ్చినట్లు తెలుస్తుంది.. అయితే దీపాల పండుగకి శ్రేయస్సు, సంపదను ఆకర్షించడానికి మీరు ఇంట్లోని ప్రదేశాలను ఇలా శుభ్రం చేస్తే ఆర్థికంగా కలిసి వస్తుందంటూ చెబుతున్నారు.. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో ఎంతో సంబరంగా జరుపుకునే దీపాల పండుగ అయినా దీపావళి పండుగ అందరూ జరుపుకోవడం సహజమే. హిందూ ధర్మం ప్రకారం ఒక దీపావళి కాదు ఏ పండుగ వచ్చినా కూడా ఇంటిని శుభ్రం చేసుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ.. అయితే ఈ దీపావళి పండుగకి ఒక ప్రాముఖ్యత ఉంది. అది ఏమిటంటే దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని గణేశుడిని ఇంట్లో పెట్టి పూజిస్తాము. ఇలా ఇంట్లో లక్ష్మీదేవిని ఆరాధించటం వలన సుఖసంతోషాలతో ఆనందంతో జీవిస్తామని అందరి నమ్మకం .. అయితే ఇంట్లో ఈశాన్యం మూల శుభ్రం చేసుకోవాలని.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ ఈశాన్య కోణం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణస్తారు.. దేవతలకు చెందినదిగా నమ్ముతారు.. అందుకే ప్రతి ఆలయాన్ని కూడా నిర్మిస్తారు..
ఈశాన్య ప్రదేశాన్ని ఒక పండగ రోజే కాకుండా ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. జ్యోతిష్యులు కూడా ఈశాన్య ప్రదేశంలో అవసరమైన వస్తువులనే ఉంచుకోవాలని ఎక్కువ బరువులను పెట్టరాదని ఎక్కువగా దేవతలను అక్కడ కొలువై ఉంటారని చెబుతారు. ప్రతి ఇంటిలోనూ ఉత్తర దిశ శుభ్రంగా ఉంచడం కూడా చాలా ముఖ్యమని దీనివల్ల లక్ష్మీదేవి ప్రతి ఇంటిలోనూ నివసిస్తూ ఉంటుందని పెద్దలు చెబుతున్నారు.