Doctor’s Negligence: నేటి డాక్టర్ల వ్యవహార శైలి మరీ అద్వాన్నంగా తయారయింది. వైద్య వృత్తిమీద ఎమోషన్ లేకుండా కేవలం డబ్బు సంపాదించడమే పరమావధిగా పలువురు డాక్టర్ల తీరు పశువులకంటే హీనంగా తయారైనది. ఒకప్పుడు వింత వింత రోగాల బారిన పది జనాలు పోయేవారు. కానీ నేడు డాక్టర్ల కక్కుర్తికి మనుషులు బలైపోతున్నారు. డబ్బుల కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారు కొందరు. అలాంటి అమానవీయ ఘటన ఒకటి యూపీలో తాజాగా వెలుగు చూసింది.
Doctor’s Negligence: డెంగీ రోగికి బత్తాయి జ్యూస్
అవును, డెంగీతో బాధపడుతున్న ఓ రోగికి ప్లాస్మా పేరుతో ఓ బ్లడ్ బ్యాంక్ బత్తాయి జ్యూస్ను ఎక్కించింది. వివరాల్లోకి వెళితే, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ప్రయాగ్రాజ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్కడ వైద్యులు ఏమనుకున్నారో ఏమో గాని, బ్లడ్ ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించడంతో బాధితుడు మరణించాడు. కాగా ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలను వేదాంక్ సింగ్ అనే నెటిజన్ ట్వీట్ చేయగా నెటిజన్లు పెద్దస్థాయిలో డాక్టర్లపై విరుచుకుపడుతున్నారు.
వీడియో వైరల్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సదరు వీడియోలో ప్రయాగ్రాజ్ లోని ఝల్వా ప్రాంతంలో ఉన్న గ్లోబల్ ఆసుపత్రిలో స్కామ్ అని ఓ వ్యక్తి చెప్పడం మనం గమనించవచ్చు. ఆసుపత్రితో సంబంధం ఉన్న వైద్యులు బ్లడ్ ప్లాస్మా అవసరం ఉన్న రోగులకు బత్తాయి జ్యూస్ని సరఫరా చేస్తున్నారని తెలుస్తోంది. అంతేగాక బత్తాయి జ్యూస్ ఎక్కించడం వల్లే రోగి చనిపోయాడని కూడా ఇక్కడ స్పష్టం అవుతోంది. ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకొని చర్యలు తీసుకోవాలని స్థానికులు, నెటిజన్లు కోరుతున్నారు. ఇకపోతే ఫేక్ ప్లాస్మా పంపిణీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు అన్నారు.