Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయా పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రచారంతో పాటు ధన ప్రవాహం సాగుతోందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నిరోధించేందుకు మునుగోడుకు వెళ్లే అన్ని మార్గాల్లో విస్తృతంగా వాహనాల తనిఖీ చేస్తున్నారు అధికారులు.
వాహనాల తనిఖీల్లో నోట్ల కట్టలు బయటపడుతుండటంతో ఇవన్నీ ఎన్నికల్లో పంపకాలకే అన్న అనుమానాలు కలుగుతున్నాాయి. ఇబ్రహీంపట్నం – సాగర్ హైవే పై ఈ రోజు ఓ కారులో పెద్ద ఎత్తున నగదు ఉండటాన్ని గమనించిన పోలీసులు వాటిని లెక్కించగా దాదాపు రూ.63 లక్షలకుపైగా నగదు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిన్ననే హైదరాబాద్ పాత బస్తీలో కోటి రూపాయలకుపైగా హవాలా నగదును అధికారుుల స్వాధీనం చేసుకున్నారు.
ఓ పక్క వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు, మరో వైపు పక్కా సమాచారంతో వివిధ ప్రాంతాల్లో నిల్వచేసిన హవాలా నగదును పట్టుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో దాదాపు 15 కోట్ల రూపాయల వరకూ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు