మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో నాగ్ పూర్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ జీఎన్ సాయిబాాబాకు బాంబే హైకోర్టు భారీ రిలీఫ్ ఇచ్చింది. ఈ కేసులో ఆయనతో పాటు మరో అయిదుగురు నిర్దోషులుగా తేల్చిన బాంబే హైకోర్టు తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వేరే ఏదైనా కేసులో వీరు నిందితులుగా ఉంటే మినహా వీరందరినీ తక్షణమే జైలు నుండి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణపై 2014 మే నెలలో సాయిబాబా, ఓ పాత్రికేయుడు, జవహార్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం విద్యార్ధి సహా మరి కొందరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఈ తర్వాత 2017 మార్చిలో నిందితులకు సెషన్స్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అప్పటి నుండి వీరు నాగ్ పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
కేసులో దోషులుగా శిక్ష అనుభవిస్తున్న వీరు సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ ధర్మాసనం విచారణ జరిపింది. వీరందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ కీలక తీర్పు వెల్లడించింది. 2014 లో సాయిబాబా అరెస్టు నేపథ్యంలో ఢిల్లీ యూనివర్శిటీ ఆయనను సస్పెండ్ చేసింది. గత ఏడాది ఆయనను సర్వీస్ నుండి పూర్తిగా తొలగించింది. అయితే ఇప్పుడు హైకోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చి విడుదల చేసిన నేపథ్యంలో మళ్లీ ఆయనను విధుల్లోకి తీసుకుంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది.
ఏపిలో ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర