Devatha: చిన్మయి దేవి గురించి ఆలోచిస్తూ ఏదో లోకంలో ఉంటుంది.. అది గమనించిన మాధవ్ నేను గత కొద్దిగే రోజులుగా నా టెన్షన్ లో పడి.. అసలు చిన్మయి గురించి ఆలోచించడం లేదు అని మాధవ్ మనసులో అనుకొని చిన్మయి దగ్గరకు వెళ్తాడు.. ఏమైందమ్మా చిన్మయి అలా ఉన్నావు అని అడుగుతాడు.. ఏం లేదు నాన్న నేను బానే ఉన్నాను అని చిన్మయి అంటుంది.. నాన్న నేను అంటే నీకు నిజంగానే ఇష్టమేనా అని మాధవ్ ను చిన్మయి అడుగుతుంది.. అదేంటమ్మా అలా అడిగావు అని మాధవ్ షాక్ అవుతాడు..!
మరి నువ్వు ఎందుకు నాన్న ఎప్పుడు ఆఫీసర్ సార్ లాగా మమ్మల్ని దగ్గరికి తీసుకోవు.. మాతో నవ్వుతూ మాట్లాడవు.. కనీసం మాతో కబుర్లు కూడా చెప్పవు.. అదే ఆఫీసర్ సారైతే మమ్మల్ని చూడడానికి కోసం.. మా కోసమే స్కూల్ దగ్గరికి వస్తారు.. మాతో ప్రేమగా కబుర్లు చెబుతారు అని చిన్మయి అంటుంది.. ఒక్కొక్కసారి నిన్ను చూస్తుంటే నాకు నాన్న లాగానే అనిపించడం లేదు.. నాకు తండ్రి ఉన్నా లేనట్టే అని చిన్మయి అంటుంది.. ఆ మాటలకు మాధవ్ బాధపడతాడు..
చిన్మయి అన్న మాటలు విన్న రాధ మాధవ్ దగ్గరకు వెళ్లి బిడ్డ అంతలా బాధపడుతుంది అంటే.. నువ్వు ఎంతలా మారిపోయావో అర్థం చేసుకోండి సారు.. ముందు రాక్షసుడిని నుంచి మారి మనిషిలా బ్రతుకు.. కనీసం బిడ్డ కన్నా దగ్గరకవు అని రాధా మాధవ్ కి క్లాస్ పీకుతుంది.. రాధా అన్న మాటలను విన్న మాతో తనలో చలనం కలిగినట్టుగా అనిపిస్తుంది. ఇక రాదా పిల్లలిద్దరిని తీసుకొని పొలం దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పి పొలం కు వెళ్తుంది అయినా కానీ దేవి మనసులో ఏదో తెలియని బాధ ఉంటుంది..
రేపటి ఎపిసోడ్లో ఆదిత్య పొలం దగ్గర ఉన్న రాధ వాళ్ళ దగ్గరకు వస్తాడు ఏమైందమ్మా దేవి అలా ఉన్నావు అని అడుగుతాడు.. ఆఫీసర్స్ అంకుల్ మా దేవి బాధ పోవాలంటే మీరు కూడా నాగలి పట్టి పొలం దున్నాలి అని చిన్మయి అంటుంది.. ఇక ఆదిత్య రుక్మిణి ఇద్దరు కలిసి పొలం దున్నుతారు.. వెనకమాల ఆ నాగలిని దేవి సరి చేస్తూ ముందుకు తీసుకువెళ్తుంది.. ఆ సీన్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది.. ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం..