Jabbardasth Apparao: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఏపీ రాజధాని కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. అభివృద్ధి అంతటా జరగాలని సీఎం జగన్ అమరావతితో పాటు విశాఖపట్నం ఇంకా కర్నూలులో కూడా రాజధాని పెట్టడానికి మూడు రాజధానులు కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. అసెంబ్లీలో కూడా చట్టబద్ధంగా మూడు రాజధానులకు మద్దతు లభించింది ఇదే సమయంలో మరొక అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా గుర్తించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంకా పలు రాజకీయ పార్టీలు అమరావతికి జై కొడుతున్నాయి. అంతేకాకుండా అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు మద్దతు తెలుపుతూ ఉన్నారు.
పరిస్థితి ఇలా ఉంటే జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన అప్పారావు.. మూడు రాజధానులకు సంబంధించి జగన్ తీసుకున్న నిర్ణయానికి జై కొట్టారు. అక్టోబర్ 15వ తారీకు వైసీపీ ఆధ్వర్యంలో జరగనున్న “విశాఖ గర్జన” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోషల్ మీడియాలో వీడియో ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు. అప్పారావు వీడియోలో ఏమన్నారంటే విశాఖపట్నం పరిపాలన రాజధాని కోసం ఈ ప్రాంతానికి చెందిన కళాకారుడిగా “విశాఖ గర్జన” కు సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని జరగబోయే “విశాఖ గర్జన”కు.. ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
అంతేకాదు విశాఖ రాజధానిగా మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి తన ధన్యవాదాలు అని కూడా పేర్కొన్నారు. దీంతో జబర్దస్త్ అప్పారావు పేరు సోషల్ మీడియాలో మారుమొగుతుంది. మరోపక్క అమరావతి రాజధానిగా మాత్రమే గుర్తించాలని అంటున్న వాళ్లు జబర్దస్త్ అప్పారావు నీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా వైసీపీ ఆధ్వర్యంలో రేపు జరగబోయే విశాఖ గర్జన కార్యక్రమానికి ఉత్తరాంధ్ర కీలక నాయకులు మద్దతు తెలుపుతూ ఉన్నారు. విశాఖ రాజధానిగా గుర్తిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్ముతున్నారు. మరోపక్క ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవాని కార్యక్రమం కోసం విశాఖకు వస్తూ ఉండటంతో.. విశాఖ వేదికగా సరికొత్త రాజకీయ వాతావరణం ఆలుముకుంటుంది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!