వదల బొమ్మాలి అన్నట్లు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వదిలి ఇప్పట్లో వెళ్లేలా కనబడటం లేదు. చైనా లోని వ్యూహాన్ లో పురుగు పోసుకుని ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసి కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా పలు దేశాల్లో కొనసాగుతూనే ఉంది. కరోనా కేసులు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో భారత్ తో సహా అనేక దేశాల్లో జనాలు సాధారణ జన జీవనానికి అలవాటు పడ్డారు. అయితే చైనా తో సహా పలు దేశాల్లో కోవిడ్ కేసులు మరల భారీ సంఖ్యలో నమోదు అవుతుండటం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తొంది. వివిధ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో భారత్ అప్రమత్తమైంది.
కోవిడ్ కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలనీ, పాజిటివ్ కేసుల నమోదును జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలని సూచించింది. ఇన్సాకాగ్ నెట్ వర్క్ ద్వారా కొత్త కేసులను ట్రాక్ చేయాలని సూచిస్తూ రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లేఖ రాసింది.
జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్, చైనా లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాకేశ్ భూషణ్ పేర్కొన్నారు. కొత్త వేరియంట్ లను ఇన్సకాగ్ నెట్ వర్క్ ద్వారా ట్రాక్ చేసేందుకు పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అలా చేయడం వల్ల సరైన సమయంలో కొత్త వేరియంట్ లను గుర్తించగలగుతామనీ, దానికి తగినట్లుగా వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురాగలుగుతామని రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు.
ప్రజాగ్రహం నేపథ్యంలో చైనా ఇటీవల కరోనా ఆంక్షలను సడలించింది. దీంతో రోజు వారి కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే మూడు నెలల్లో కరోనా ప్రబలుతున్న దేశాల్లో అక్కడి జనాభాలో 60 శాతం మంది ప్రజలు కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్ వంది దేశాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు 35 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. భారత్ లో మంగళవారం 112 కొత్త కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 3,490గా ఉంది.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్ ఇది