Congress: కీలకమైన ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గాంధీ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉన్న పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో జితిన్ బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో షాక్ తినగడం కాంగ్రెస్ వంతు అయింది.
Read More: Corona: కరోనాతో పిల్లలకు ప్రమాదం లేదు – ఎవరు ప్రకటించారో తెలుసా?
కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాంక్
2022లో కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటికే ఫోకస్ పెట్టింది. మరోవైపు ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యూపీపై ప్రియాంకాగాంధీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
ఎస్పీ, బీఎస్పీ నేతలు కూడా మరోవైపు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఇలాంటి సమయంలో యూపీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడనే పేరు పొందిన జితిన్ ప్రసాద ఆ పార్టీని వీడారు. 2019లోనే ఆయన పార్టీ వీడుతారనే ప్రచారం జరిగినప్పటికీ ప్రియాంకాగాంధీ నచ్చజెప్పడంతో అప్పట్లో ఆయన వెనక్కి తగ్గారు. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు.
Read More: Corona: వాట్సాప్ తో కరోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవచ్చంటే…
బీజేపీ మాత్రమే ..
బీజేపీ లో చేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన జితిన్ ప్రసాద కాంగ్రెస్ పార్టీతో తనకు మూడు తరాల అనుబంధం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకునేందుకు చాలా చర్చించాల్సి వచ్చిందని తెలిపారు. అయితే దేశ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ బీజేపీ కాబట్టి తాను బీజేపీలో చేరినట్టు వెల్లడించారు. నిజమైన రాజకీయ పార్టీ ,ఏకైక జాతీయ పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. మిగిలిన పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలని కామెంట్ చేశారు. ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే ఎదుర్కోగలరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.