Corona Virus: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కట్టడికి లాక్ డౌన్, కర్ఫ్యూ లాంటి ఆంక్షలను కొనసాగిస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కనబడుతోంది. తాజా గణాంకాల ప్రకారం కొత్త కేసులు లక్షకు దిగివచ్చాయి. సుమారు రెండు నెలలలో కనిష్టానికి చేరడం అటు పాలకులకు, ఇటు ప్రజలకు ఊరట కల్గిస్తోంది. రికవరీ రేటు కూడా 94 శాతానికి చేరువ అయ్యింది.
Read More: Etela rajender: ఈటల బీజేపీ చేరిక ముహూర్తం ఖరారు..! ఎప్పుడు? ఎక్కడ అంటే..?
కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. నిన్న దేశ వ్యాప్తంగా 15,87,589 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కేవలం 1,00,636 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అంతకు ముందు రోజుతో పోలిస్తే 12 శాతం తగ్గుదల కనిపించింది. గడచిన 24 గంటల్లో 2,427 మంది కరోనాతో మృతి చెందారు. నిన్న ఒక్క రోజే లక్షా 74 వేల 399 మంది కరోనా నుండి కోలుకున్నారు. రికవరీ రేటు 94 శాతానికి చేరువ అయ్యింది. ఇప్పటి వరకూ మొత్తం 2,89,09,975 మంది కరోనా బారిన పడగా మూడు లక్షల 49 వేల 186 మంది మహమ్మారికి బలి అయ్యారు. 2 కోట్ల 70 లక్షల మందికిపైగా చికిత్స అనంతరం కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 14 లక్షల ఒక వేయి 609 ఉన్నాయి.
Read More: Screaming snake: అరిచే పామును ఎప్పుడైనా చూశారా..? ఇదిగో చూడండి..!!
మరో పక్క దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతోంది. ఆదివారం 13 లక్షల 90 వేల మందికి వ్యాక్సినేషన్ జరిగింది. ఇప్పటి వరకూ 4.46 కోట్ల మందికి రెండు డోసులు పూర్తి కాగా 180,972,102 మందికి మొదటి డోస్ టీకా పంపిణీ జరిగింది. మొత్తంగా ఇప్పటి వరకూ పంపిణీ అయిన డోసుల సంఖ్య 23 కోట్లు దాటింది.