Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్ల ఓ కాంగ్రెస్ నేత , మాజీ కాంగ్రెస్ నేత ప్రత్యేక రికార్డు సృష్టించారు. గతేడాది కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి, మధ్యప్రదేశ్ లో ఆ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియాకు అధిష్టానం మంచి బహుమతే ఇచ్చింది. మోడీ మంత్రివర్గంలో ఆయనకు పౌర విమానయాన శాఖ దక్కింది. అయితే, విషయం ఇక్కడితోనే అయిపోలేదు. ఇక్కడే ఓ రికార్డు కూడా ఉంది.
Read More: Modi: అటు గవర్నర్లు…ఇటు మంత్రులు. .మోడీ లెక్క ఏంటో తెలుసా?
తండ్రి సైతం అదే…
సరిగ్గా 20 ఏళ్ల కిందట ఆయన తండ్రి మాధవరావ్ సింధియా కూడా పీవీ నరసింహారావు ప్రభుత్వంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పని చేశారు. 1991 నుంచి 1993 మధ్య ఆయన ఈ శాఖా బాధ్యతలు నిర్వహించారు. ఇండియాలో కీలకమైన ఆర్థిక సంస్కరణలు చేపట్టిన సమయమది. అలాంటి సమయంలో మాధవరావు సింధియా తన మార్కు చాటుకున్నారు.
2001లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో మాధవరావ్ సింధియా మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న ఓ విమానం ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి శివార్లలో కుప్పకూలింది. తండ్రి హఠాన్మరణంతో జ్యోతిరాదిత్య సింధియా రాజకీయాల్లో అడుగుపెట్టారు. మాధవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గుణ లోక్సభ నియోజకవర్గానికి 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.
Read More: Modi: మోడీ విషయంలో చాలా మంది చేయలేని పని ఈ యువ మంత్రి చేసేశాడు
జ్యోతిరాదిత్య సింధియాపై..
మరో విషయం ఏంటంటే వీరిద్దరూ.. పౌరవిమానయాన శాఖ బాధ్యతలు చేపట్టకముందు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. మాధవరావ్.. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా వ్యవహరించగా.. మన్మోహన్సింగ్ నేతృత్వంలోని యూపీఏ సర్కారులో జ్యోతిరాదిత్య ఐటీ, సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. కోవిడ్ కారణంగా మరోసారి సంక్షోభంలో పడిన పౌర విమానయాన శాఖ బాధ్యతలను జ్యోతిరాదిత్య సింధియా చేపట్టడం ఆసక్తికరం.ఈ బాధ్యతలు జ్యోతిరాదిత్య ఎలా నెట్టుకువస్తారో మరి.