NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: జగన్ + రేవంత్ + కిషన్.. ముగ్గురు రెడ్ల తలరాతను ఒక్క నిర్ణయంతో మార్చేసిన కేసిఆర్

KCR: రాజకీయాల్లో నేతల తలరాతలు ఊహించని విధంగా మారుతుంటాయి. ఒక్కో సారి నేతలు తీసుకున్న నిర్ణయాలు ప్రత్యర్థులకు లాభం చేకూరుస్తుంటాయి. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ గతంలో తీసుకున్న ఓ నిర్ణయం ప్రత్యర్థి పార్టీలకు చెందిన ముగ్గురి నేతలకు బంగారు బాట అయ్యింది. అందులో ఓ నేత కేంద్ర కేబినెట్ మంత్రి స్థాయికి ఎదగగా ఇద్దరు రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలకు ఛీఫ్ లు అయ్యారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల కేసిఆర్ వ్యూహం బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు కలసివచ్చాయి. ఈ ముగ్గురు నేతల తలరాతలు మారడానికి ఓ విధంగా పరోక్షంగా కేసిఆర్‌యే కారణం. మరో పక్క ఏపిలో వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడానికి కూడా ఓ రకంగా కేసిఆర్ కారణం అని చెప్పవచ్చు. ఏడాది ముందు ఎన్నికలు అయిపోయి కేసిఆర్ రెండవ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయనకు ఏపిలో టీడీపీలో అధికారంలోకి రాకుండా చేయడం కోసం కేసిఆర్..జగన్ కు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన విషయం తెలిసిందే.

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 2018లో జరిగిన ఎన్నికల్లో అంబర్‌పేట నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషన్ రెడ్డి, కరీంనగర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్, కొడంగల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డిలు పరాజయం పాలైయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన వీరు ముగ్గురు ఆ తరువాత 2019 లో ఎన్నికల్లో ఎంపిలుగా విజయం సాధించారు. సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుండి కిషన్ రెడ్డి, కరీంనగర్ లోక్ సభ స్థానం నుండి బండి సంజయ్, మల్కాజ్‌గిరి స్థానం నుండి రేవంత్ రెడ్డిలు పార్లమెంట్ సభ్యులుగా విజయం సాధించారు. ఇదే వీరి దశ తిరగడానికి కారణం అయ్యింది.

కిషన్ రెడ్డి తొలుత కేంద్ర సహాయ మంత్రి, ఆ తరువాత కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారు. అదే విధంగా బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా, రేవంత్ రెడ్డి టీ పీసీసీ అధ్యక్షుడుగా నియమితులు అయ్యారు. రాజకీయంగా వీరిని దెబ్బతీయాలని కేసిఆర్ ప్రయత్నించినా ఊహించని విధంగా అదృష్టం కలిసి వచ్చింది. నాడు చంద్రబాబు మంత్రి వర్గంలో కేసిఆర్ ను తీసుకుని ఉంటే ఆయన పార్టీ నుండి బయటవెళ్లే వారు కాదు, టీఆర్ఎస్ స్థాపించేవారు కాదు, రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని ఇప్పటికీ అంటుంటారు. అందుకే అంటారు రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరని. ఊహించని పరిణామాలు సంభవిస్తుంటాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju