Microsoft Bonus: కరోనా మహామ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది. ప్రతి ఒక్కరూ ఏదో రూపంగా ప్రభావానికి గురైయ్యారు. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన వారు కొందరైతే వ్యాపారాలు నష్టపోయి ఆర్థికంగా దెబ్బతిన్న వారు మరి కొందరు. ఇలా అనేక రంగాలపై కరోనా ప్రభావం చూపింది. మరో పక్క కరోనా బారిన పడటం వల్ల అనేక మంది ఆర్థికంగా చితికిపోయారు. ఈ తరుణంలో తమ ఉద్యోగులను ఊరట కల్గించేందుకు ఫేస్ బుక్, అమెజాన్ వంటి సంస్థలు బోనస్ లు ఇస్తూ సర్ ప్రైజ్ చేశాయి. తాజాగా ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా తమ ఉద్యోగులకు భారీ మొత్తంలో బోనస్ ప్రకటించి ఉద్యోగులకు తీపి కబురు అందించింది.
ఈ క్రమంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులందరికీ ఒకొక్కరికి 1500 డాలర్లు …అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.1.12 లక్షలు సింగిల్ టైమ్ బోనస్ గా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కరోనా కారణంగా ఆర్థిక సంవత్సరం కష్టంగా గడిచిన నేపథ్యంలో ఉద్యోగుల కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలియజేసింది. కార్పోరేట్ వైస్ ప్రెసిడెంట్ కంటే కింది స్థాయి లో ఉన్న ఉద్యోగులకు ఈ బోనస్ వర్తిస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. మార్చి నెలకు ముందు ఉద్యోగాలలో చేరిన ఉద్యోగులందరికీ ఈ బోనస్ అందించనున్నారు.
Read More: Pearls Harvest: ముత్యాల సాగుతో లక్షలు ఆర్జించవచ్చు..! అదెలా అంటే..!!
అయితే మైక్రోసాఫ్ట్ అనుబంధంగా పని చేస్తున్న లింక్టిన్, గిటాహబ్, జెనీమ్యాక్స్ కు చెందిన ఉద్యోగులకు మాత్రం ఈ బోనస్ కు అర్హులు కాదని సంస్థ తెలియజేసింది. ఈ బోనస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 1,75,508 మంది ఉద్యోగులకు లబ్ది చేకూరుతోంది. ఈ బోనస్ విలువ సుమారు 200 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. మైక్రోసాఫ్ట్ ప్రకటించిన ఈ బోనస్ మొత్తం సంస్థ రెండు రోజుల ఆదాయం కంటే తక్కువ కావడం విశేషం.