Big Breaking: దేశ వ్యాప్తంగా ట్విట్టర్ (ఎక్స్) సేవలు నిలిచిపోయాయి. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతం నుండి ట్విట్టర్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ట్విట్టర్ యూజర్లు ఏమి జరిగిందో తెలియక అయోమయానికి గురయ్యారు. అయితే దీనిపై ట్విట్టర్ నుండి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు. గతంలోనూ వాట్సాప్, ట్విట్టర్ సేవల్లో అంతరాయం ఏర్పడటంతో యూజర్లు తీవ్ర అసహనానికి గురైయ్యారు.
ప్రముఖ సెర్చ్ ఇంజన్ ట్విట్టర్ (ఎక్స్) తో వార్తలను క్షణాల్లో ప్రపంచ వ్యాప్తం చేయడం, ఏదైనా సమాచారాన్ని పొందడం జరుగుతుంది. ఒక్క సారిగా ట్విట్టర్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు తీవ్ర అసహానికి గురవుతున్నారు. ట్విట్టర్ లో పోస్టులు ఏవీ కనిపించకపోవడంతో సమాచార వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. #ట్విట్టర్ డౌన్ ట్రెండింగ్ అవుతోంది.
Covid -19 Sub Variant JN.1: పెరుగుతున్న కరోనా కేసులు .. ముగ్గురు మృతి .. ఆందోళన అవసరం లేదు కానీ..