బిగ్ బాస్ నాలుగో సీజన్ లో అందరి కంటే ఎక్కువ లాభపడిన కంటెస్టెంట్ ఎవరంటే సోహెల్ అని చెప్పాలి. ఫైనల్స్లో కనీసం రన్నరప్ కూడా కాకుండానే ఇంటికి 25 లక్షలు తీసుకెళ్లాడు. అంతేకాకుండా నాగార్జున సాయంతో పదిలక్షలు అనాధ శరణాలయానికి ఇస్తున్నాడు. తన ప్రాణ స్నేహితుడు మెహబూబ్ కి మరొక 10,00,000 అతని వల్లనే వచ్చాయి.
ఇలా మొత్తం 45 లక్షల రూపాయలను కొద్ది గంటల్లోనే సంపాదించడం తెలుగు ప్రేక్షకులు అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అసలు తను అలా ఎలా చేయగలిగాడు అన్న దాని పై సోహెల్ వివరణ కొంచెం గమ్మత్తుగా ఉంది. పైగా అనుమానాలను కూడా రేకెత్తిస్తోంది. ఇక దీని గురించి మాట్లాడుతూ బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్స్ కు ముందు తనకు పది లక్షల ఆఫర్ వచ్చింది అని అయితే ఆ మొత్తం వద్దు అనుకున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత 20 లక్షలు అన్నప్పుడు కూడా ఒప్పుకోలేదట.
చివరికి 25 లక్షల రూపాయలు అని చెప్పగానే ఆలోచించినట్లు తన సోదరుడు తండ్రి కూడా సరే అనడంతో ఆలోచనలో పడినట్లు సోహెల్ అన్నాడు. ఇక మనకి చూపించినది మాత్రం ప్రణీత సూట్కేస్ తీసుకొని వచ్చి ఇందులో పాతిక లక్షలు ఉన్నట్లు చెప్పింది. మరి సోహెల్ కు ముందు వచ్చిన ఆఫర్లు ఎవరు ఇచ్చారు అన్న విషయం పై పూర్తి స్పష్టత లేదు.
అయినా అసలు విన్నర్ కు ముందు 50 లక్షల ప్రైజ్మనీ అని ప్రకటించి లాస్ట్ లో ఇలాంటి ట్విస్ట్ కు ఏమిటో అర్థం కాలేదు. సోహెల్ ఇలా ఎక్కువగా. లాభ పడడం కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. వచ్చే సీజన్ లో అయినా బిగ్ బాస్ తన ఫార్మాట్ మారుస్తాడో లేడో చూడాలి మరి.