ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుడి కట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో గుడిని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గోపాలపురం మండలంలోని రాజపాలెంలో వైఎస్ జగన్ గుడిని నిర్మించబోతున్నారు.
ఈ గుడి నిర్మాణానికి కావాల్సిన స్థల పరిశీలన కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఆ గ్రామంలోని వైసీపీ నేతలు ఈ గుడి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వార్త స్థానికంగా సంచలనంగా మారింది. తమకోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చిన జగన్ తమకు దేవుడని
అందుకే వారికి కృతజ్ఞతగా గుడి నిర్మిస్తున్నామని వైసీపీ నేతలు అంటున్నారు. గ్రామ వైసీపీ నాయకుడు కురుకూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చేతుల మీదుగా ఈ నెలలోనే భూమి పూజ నిర్వహించి ఆలయ నిర్మాణం మొదలుపెడతామని తెలిపారు.