బాలీవుడ్ లో మరో కరోనా పాజిటివ్ కేసు వచ్చింది. ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ కు కరోనా ఉందని నిర్ధారణ అయిన కొద్దిసేపటికే అతని కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా దీని బారిన పడినట్లుగా ముంబైలోని నానావతి హాస్పిటల్ వైద్య బృందం తెలిపారు. ముందు అమితబ్ బచ్చన్.. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని అతనే స్వయంగా ట్వీట్ చేయగా తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా టెస్టు చేయించుకొని ఐస్Pలేషన్ లో ఉన్నారని అమితాబ్ చెప్పారు.
ఇకపోతే గతకొద్దిరోజులుగా అమితాబచ్చన్ అనారోగ్యం పాలయ్యారు. అయితే ఆసుపత్రిలోనే చికిత్స కూడా తీసుకున్న అతను పరిస్థితి కుదుటపడిన తర్వాత వరుస సినిమాలు చేశారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా జూలై 11 రాత్రి ఆస్పత్రిలో అడ్మిట్ అయిన అమితాబ్ కు కరోనా సోకిందన్న విషయం తెలియగానే అతని అభిమానులు కంగారు పడ్డారు. కొద్దిసేపటికే తన ఇంటి సభ్యులందరికీ కరోనా అరెస్టు చేయగా అభిషేక్ బచ్చన్ కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లు తెలుస్తోంది.
వీరిద్దరితో పాటు జయ బచ్చన్ మరియు ఐశ్వర్య రాయ్ యొక్క రిజల్ట్స్ రావాల్సి ఉంది. గత పది రోజులుగా అతను ఇంటిలోనే సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు ఎంతో సన్నిహితంగా ఉన్నట్లు అమితాబ్ చెప్పారు. అతను సందేహించినట్కుగానే అభిషేక్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ రావడం గమనార్హం. ఇక ఈ లిస్ట్ లో ఎంతమంది ఉన్నారో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!