ఇంట్లో ఉన్నది చాలు కాసింత ఊపిరి పీల్చుకుందామన్న ఆమె పిలుపుకు
ఇండోర్ కి చెందిన మహిళలు ఏకంగా డ్రైవింగ్ చేసి వారి అనుభవాలను పంచుకున్నారు ..! అసలు ఎవరు పిలుపునిచ్చారు ..? వాటి సంగతులేంటో..? ఇప్పుడు తెలుసుకుందాం ..!
మహిళలు ఒకప్పుడు వంటగదికే పరిమితమయ్యారు. కాలం మారటంతో ఇప్పుడిప్పుడే ఉద్యోగరీత్యా బయటకు వస్తున్నారు. స్త్రీలు వివిధ కారణాల వల్ల కలిసి ప్రయాణం చేస్తారు.ఆ ప్రయాణం సురక్షితంగా, సరదాగా, ఒత్తిడి లేకుండా ఉంటే అలా ప్రయాణించినప్పుడు వారు మార్పు కోసం తమపై దృష్టి పెడతారు.
‘అడ్వంచరస్ ఉమెన్ గ్రూప్’ దీని స్థాపకురాలు ఇండోర్ వ్యాపారవేత్త శ్రేష్టా గోయల్. ఈ గ్రూప్ను ఈమె నిర్వహిస్తారు.ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం స్త్రీలను పర్యటనలు, విహార యాత్రలుచేసేందుకు ప్రోత్సహిస్తుంటారు. కరోనా కారణంగా కొన్ని నెలలుగా స్తబ్దుగా ఉంది. సెప్టెంబర్ 20,2020 న “డ్రైవింగ్ ఈజ్ మై పేషన్” ఈవెంట్ ను సెప్టెంబర్ 10 నుంచి 30వ తేదీ నిర్వహించారు.ఇందులో దేశంలోని ఆరు రాష్ట్రాల నుంచి స్త్రీలు వచ్చారు. పలు రంగాలకు చెందిన వాళ్లు, గృహిణులు, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు వచ్చి ఇండోర్ లో తమ వాహనాలతో తిరిగారు. జీవితంలో ముందుకు వెళ్లాలంటే వాహనం నడపాలంటూ, ఈ స్కిల్స్ స్త్రీలకు చాలా అవసరం కూడ. పురుషులతో పాటు సమానంగా గా స్త్రీలు కూడా కార్ డ్రైవింగ్ అడ్వెంచర్ లు చేయగలరంటూ వారు చేసి చూపించారు..
రాక్ ది రోడ్స్’ అంటూ కారులో జైపూర్ నుంచి బద్రీనాథ్కు, మంగళూరు నుంచి కేరళకు కారులో డ్రైవ్ చేసుకుంటూ ఇండోర్ ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ అర్యామా సన్యాల్ ఒక వీడియో విడుదల చేశారు. కర్ణాటక రాష్ట్రమహిళా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం అధ్యక్షురాలు శిఖ డ్రైవింగ్ చేయడం వలన ఫోకస్ పెరుగుతుంది. వాహనాన్నే కాదు జీవితాన్ని కూడా కంట్రోల్ చేయడం తెలుస్తుంది.అంతేకాకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది’ అని ఒక వీడియో ను పోస్ట్ చేశారు.స్త్రీలు తమ డ్రైవింగ్ అనుభవాలు పంచుకుని మహిళలను ఉత్సాహపరుస్తూ ఈవెంట్ ను విజయవంతం చేశారు.
జీవితమే ఒక సాహసం. ప్రయాణాల ద్వారా ఆ సాహసాన్ని కొనసాగించాలి’ అందుకనే ఇండోర్లో ఆమె ‘అడ్వంచరస్ ఉమెన్ గ్రూప్’ అనే సంస్థను స్థాపించినట్లు తెలిపారు.ఈమె ఇండోర్లోని ఒక ఫార్మాసూటికల్ కంపెనీ సీఈఓ. ఇంటికి, ఉపాధికి రెండింటిని సమన్వయం చేసుకుంటూనే తమ జీవితాన్ని లోకం చూసేందుకు గడపడానికి ఇష్టపడే స్త్రీలు ఈ గ్రూప్ ద్వారా ఒక దగ్గర చేరారు.కాళ్లకు చక్రాలున్నాయని నమ్మే స్త్రీలే ఈ గ్రూప్లో సభ్యులు. వీరు ఇండోర్ నుంచి కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే ఒకరోజు విహారానికి బయలుదేరారు. యాభైకిలోమీటర్ల చుట్టుపక్కల ప్రాంతాలు చూసి వచ్చారు.‘మేము పర్యటించడమే కాదు పర్యటించమని స్త్రీలకు స్ఫూర్తినిస్తాం’ అంటారు వాళ్లు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక పర్యటనను చేస్తుంటామని తెలిపారు. వీరిని చూస్తుంటే ప్రతిచోటా ఇలాంటి బృందాలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది.