Akhanda: గత ఏడాది నుంచి అన్నీ ఇండస్ట్రీస్ను కరోనా వెంటాడి ఆర్ధిక సంక్షోభంలో నెట్టేసిన సంగతి తెలిసిందే. దీనివల్ల మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి వేలకోట్లలో నష్ఠం వాటిల్లింది. ఈ కారణంగా ఇప్పటికే చాలా థియేటర్స్ గోదాములుగానూ, కళ్యాణ మండపాలుగాను మారాయి. సినిమాను నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు ఆర్ధిక సమస్యలతో సతమతమయ్యాయి. వీటన్నిటిని తట్టుకొని గత ఏడాది కాస్త ధైర్యాన్ని ఇచ్చిన సినిమా మెగా హీరో సాయి ధరం తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్. మన మెగా హీరో ధైర్యం చేసి తన సినిమాను థియోటర్స్కు తీసుకువచ్చాడు.
ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులను చూసి ఈ ఏడాది ప్రారంభంలో మాస్ మహారాజ రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో క్రాక్ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా ఇండస్ట్రీకి కొత్త ఆశలు కలిగించింది. క్రాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్ఠించిన సునుమిని ఎలాంటిదో అందరికీ తెలిసిందే. కరోనా నుంచి బయటపడుతూ థియేటర్స్కు వచ్చిన జనాలు క్రాక్ సినిమాకు నీరాజనాలు పలికారు. ఈ సినిమా రవితేజ కెరీర్లోనే అత్యంత భారీ వసూళ్ళు రాబట్టిన సినిమాగా నిలిచింది.
Akhanda: ఇంతలోనే మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చి అందరినీ వణికించింది.
ఇంతలోనే మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చి అందరినీ వణికించింది. ఇలాంటి పరిస్థితుల్లో భారీ బడ్జెట్ సినిమా అంటే థియేటర్స్కు ప్రేక్షకులు వస్తారా అనే సందేహాలు మొదలయ్యాయి. వాటన్నిటిని బాలయ్య అఖండ సినిమా పటాపంచలు చేసేసింది. ఏపీలో టికెట్ రేట్స్ సమస్య ఉన్నా కూడా అఖండ సినిమా భారీ వసూళ్ళను రాబట్టి అఖండ విజయాన్ని సాధించింది. ఇప్పటికే బ్రేకీవెన్ టార్గెట్ దాటేసింది అఖండ సినిమా. బోయపాటి – బాలయ్య ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియన్ సినిమాల విషయంలో భయపడుతున్న మేకర్స్కు అఖండ కొండంత ధైర్యాన్నిచ్చింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!