Alia Bhatt : ఇపుడు బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ జంట ఏదైనా వుంది అంటే అది ఆలియా,రణ్బీర్ జంట మాత్రమే. గత కొన్నేళ్లుగా ప్రేమలో వున్న వీరు మూడు ముళ్ళతో ఒక్కటి కానున్నారు. ఇప్పటికే వీరు ఒకటి కావలిసింది. కానీ, కరోనా ఎఫెక్ట్తో అన్ని పెళ్ళిళ్ళలానే ఈ పెళ్లి కూడా వాయిదా పడింది. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఆల్మోస్ట్ తగ్గడంతో వీరు తమ మేరేజ్ సెలబ్రేషన్స్ను గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ జంట తాజాగా పెళ్లి పీటలెక్కనుంది. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఏప్రిల్ 14వ తేదీన ఒక్కటి కానున్నారు.
Alia Bhatt : అతిధులు వీరే?
ఇంచుమించు 3 సంవత్సరాలుగా వీరిద్దరి వివాహం గురించి మీడియాలో కధనాలు ముమ్మురంగా వచ్చాయి. ఇపుడు ఎట్టకేలకు వీరి వివాహం జరుగబోతుంది. దీనికి బాలీవుడ్ ప్రముఖులు, అలాగే సౌత్ నుండి కూడా కొంతమంది ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలో భాగం కానున్నారు. కొంతమంది ప్రముఖులకు వీరు ఇప్పటికే ఆహ్వానం అందించారు. పెళ్లికి లిమిటెడ్ గా ఆహ్వానాలు అందించిన ఈ జంట రిసెప్షన్ కు మాత్రం ఎక్కువ మందిని ఆహ్వానించినట్లుగా బాలీవుడ్లో టాక్ నడుస్తోంది.
పెళ్లి వేదిక ఇదే:
ఆలియా – రణబీర్ ల పెళ్లి రిసెప్షన్కు ఓ చారాత్రాత్మక హోటల్ వేదిక కానుంది. ముంబైలోని ప్రముఖ తాజ్ హోటల్ వీరి రిసెప్షన్ కు వేదిక కానుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుకుగా సాగుతున్నట్లు సమాచారం. ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ లు కలిసి ఏప్రిల్ 17న తాజ్ మహల్ హోటల్ లో సెలబ్రిటీల కోసం భారీ విందును ఏర్పాటు చేసినట్టు భోగట్టా. అయితే ఈ తాజ్ మహల్ హోటల్పై గతంలో టెర్రరిస్టుల దాడి జరిగిన విషయం తెలిసిందే కదా.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!