Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో మరో సంక్షేమ పథకం అటకెక్కే సూచనలు గోచరిస్తున్నాయి.ఎల్ఐసి పత్రికాముఖంగా విడుదల చేసిన ఒక ప్రకటన కారణంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2009 లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన అభయహస్తం పథకం అయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రిగా వుండగా ఆగిపోయే పరిస్థితులు తలెత్తాయి.
స్వయం సహాయక గ్రూపుల సభ్యులైన మహిళలకు వారి వృద్ధాప్యంలో పింఛను ఇచ్చే అభయహస్తం పథకానికి రూపకల్పన చేశారు.వయసును బట్టి కనీసం ఐదు వందల నుండి రెండువేల రెండువందల రూపాయల వరకు నెలవారీ పింఛన్ వారికి లభించేటట్లు ఈ పథకాన్ని రూపొందించారు.2009 నుండి ఈ పథకం రాష్ట్రంలో అమల్లో ఉంది.చివరకు ఇది టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగింది.జగన్ సీఎం అయ్యాక రెండేళ్లు ఈ పథకాన్ని కొనసాగించారు.అయితే వచ్చే నెల నుండి ఈ పథకం అమలు కాకపోవచ్చుననే సందేహాన్ని రేకెత్తించేలా ఎల్ఐసీ ఒక ప్రకటన విడుదల చేసింది.
Andhra Pradesh: అభయహస్తం పథకం అమలు ఇలా!
అభయహస్తం పథకం కింద వృద్దాప్యంలో పింఛన్ పొందేందుకు వీలుగా స్వయం సహాయక గ్రూపులు సభ్యురాలైన సభ్యులైన మహిళలు సంవత్సరానికి మూడు 365రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.పధ్ధెనిమిది నుండి యాభై అయిదు సంవత్సరాల వయసు ఉన్న మహిళలు ఈ పథకంలో చేరడానికి అర్హులు.ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రతి సభ్యురాలు పైనా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది.ఈ మొత్తాలపై వచ్చే వడ్డీని, అసలు మొత్తాన్ని క్రోడీకరించి సభ్యురాలికి 60 సంవత్సరాలు వచ్చినప్పట్నుంచి నెలకు కనీసం అయిదువందల రూపాయలు పింఛన్ ప్రభుత్వం అందజేస్తోంది.చిన్న వయసు ఈ పథకంలో డబ్బు జమ చేస్తూ పోతే పింఛన్ రెండువేల రెండు వందల రూపాయలు వరకు వచ్చే అవకాశం ఉంటుంది.
Andhra Pradesh: ఎల్ఐసీతో ఒప్పందం
ఈ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుంది.సభ్యుల ప్రీమియం, ప్రభుత్వం జమ చేసే మొత్తాలను ఎల్ఐసీలో ఉంచి అర్హులైన మహిళలకు ఇప్పటి వరకు పింఛన్ అందజేస్తూ వస్తున్నారు.ఎల్ఐసీలో ఈ నిధి కింద దాదాపు రెండువేల కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం.
ఇప్పుడేమి జరిగిందంటే?
కాగా అభయహస్తం పథకానికి సంబంధించి తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసుకుని నిధి రూపంలో ఉన్న నగదు మొత్తాన్ని మొత్తం వెనక్కు తీసుకుందని ఎల్ఐసీ ఈనెల 27 వ తేదీన ప్రముఖ దినపత్రికల్లో ప్రకటన ఇచ్చింది.ఇక ఈ పథకంతో తమకు సంబంధమే లేదని ఎటువంటి క్లెయిములు స్వీకరించేది, నగదు చెల్లించేది ఉండబోదని ఎల్ఐసి స్పష్టం చేసింది.ఇకపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పేదరిక నిర్మూలన సంస్థ ఈ పథకానికి బాధ్యత వహిస్తుందని వెల్లడించింది.ఇది ఓ రకంగా బాంబులాంటి వార్త .ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరకు ఈ నిధి కింద ఉన్న వేల కోట్ల రూపాయలు కూడా తీసేసుకున్నట్లు అర్థమవుతోంది.మరి అభయహస్తం పథకం అమలవుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.