న్యూఢిల్లీ: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించాలని ఈ సందర్భంగా జగన్ కోరారు. దాదాపు గంట సేపు వివిద అంశాలపై గడ్కరీతో జగన్ చర్చించారు. ఈ కార్యక్రమంలో జగన్ వెంట వైసిపి ఎంపిలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, బాలశౌరి, రఘురామకృష్ణంరాజు, సురేష్, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణంబాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రమేష్ బాబు ఉన్నారు.
రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపి సిఎం జగన్ నిన్న ప్రధాని మోదితో సమావేశమై వివిధ అంశాలపై చర్చించడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు తదితర అంశాలపై వినతి పత్రాన్ని అందజేశారు. బుధవారం గడ్కరీని కలవక మందు రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు.