CM YS Jagan: వైఎస్ఆర్ కల్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ఐదో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ఇవేళ సీఎం జగన్ బటన్ నొక్కి లబ్దిదారుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. 10,132 మంది లబ్దిదారులకు రూ.78 కోట్ల 53 లక్షలను సీఎం జగన్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ .. ఇప్పటి వరకూ 56,194 మంది లబ్దిదారులకు రూ.427.27 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. పేద కుటుంబాలు అప్పులపాలు కావొద్దని.. అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్ఆర కల్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నట్లు పునరుద్ఘాటించారు.
ప్రతి ఒక్కరూ పిల్లల చదువులను ప్రోత్సహించేందుకే ఈ పథకం కింద పదో తరగతి సర్టిఫికెట్ ఇద్దరికీ ఉండాలని కండిషన్ పెట్టినట్లుగా చెప్పారు. దీని వల్ల కచ్చితంగా ఈ స్కీమ లో ఎలిజిబులిటీ రావాలంటే చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సహం ఇచ్చేలా ఉపయోగపడుతుందన్నారు.
AP High Court: ఎస్జీటీ పోస్టుల భర్తీపై ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఏపీ హైకోర్టు