Priyamani: సోషల్ మీడియా వచ్చాక సినిమా సెలబ్రిటీల హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీన్ని ఒక ప్లాట్ ఫామ్ గా చేసుకుని తమ వ్యక్తిగత విషయాలు ఇంకా అనేక వాటి గురించి అభిమానులతో ఫాలోవర్స్ తో పంచుకుంటారు. ఇదే సమయంలో సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా కెమెరాలు వాళ్ల వెంటే ఉంటాయి. ముఖ్యంగా జిమ్లు, విమానాశ్రయాల నుండి బయటకు వచ్చినప్పుడు… ఫోటోగ్రాఫర్లు హీరోయిన్ అందాలను కెమెరాలో బంధిస్తారు. కొన్నిసార్లు వారి కోసం ఫోటోగ్రాఫర్లు బయట వేచి ఉంటారు.ఇది చూసి వామ్మో సెలబ్రిటీల లైఫ్ బెటర్ అని అనుకుంటారు.
కానీ రియాలిటీ లోకి వెళ్తే ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని సీనియర్ హీరోయిన్ ప్రియమణి లేటెస్ట్ గా తెలియజేశారు. అదే సమయంలో ఫోటోగ్రాఫర్లకు డబ్బులిచ్చి ఇలాంటి చిత్రాలు తీయించుకుంటారని సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో, ప్రకటనలు పొందడం పెద్ద విషయమేమీ కాదన్నట్లుగా ఇటీవల పరిస్థితి మారిపోయింది. ఇటీవల చాలా మంది హీరోయిన్లు జిమ్లో శిక్షణ పొందుతూ బయటకు వెళుతుండగా.. చాలా మంది ఫోటోగ్రాఫర్లు వారి కోసం ఎదురుచూస్తూ ఫోటోలు దిగుతున్నారు. మరి ఇలాంటి వీడియోలు చూసిన నెటిజన్లు ఈ బ్యూటీకి మామూలు ఫ్యాన్ బేస్ లేదంటున్నారు. అయితే ఎయిర్పోర్ట్లో చాలా మంది హీరోలు, హీరోయిన్లు ఇలాంటి ఫొటోలు దిగడం కూడా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం.
ఒక్కోసారి హీరో, హీరోయిన్ ఒకే సమయంలో అక్కడికి చేరుకుంటారనే విషయం ఫోటోగ్రాఫర్ లకి ఎలా తెలుస్తుందని ఆశ్చర్యపోతారు. అయితే తాజాగా ఓ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి ఇదే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బహుశా ఈ విషయం ఇంకా ఎవరికీ తెలియకపోవచ్చు. ఇది ముంబైలో జరుగుతుంది. విమానాశ్రయంలో ప్రముఖులు కనిపించినప్పుడు, ఫోటోగ్రాఫర్లు అక్కడ ఉంటారని మీరు అనుకుంటారు. ఎవరు ఓపెన్గా ఉంటారో ముందే ఒప్పుకుంటారు. ఎంత మంది కావాలి, ఏ సమయానికి కావాలి అంటే ఆ సమయానికి అక్కడికి చేరుకుంటారు. ఇంత డబ్బు పెట్టి ఫోటోగ్రాఫర్లను ఏర్పాటు చేసుకుంటారు అని ప్రియమణి తెలిపింది. ముంబైలో దీన్ని పపరాజీ కల్చర్ అంటారు. జవాన్ సినిమా చేస్తున్న సమయంలో ఓ ఏజెన్సీ వ్యక్తి వచ్చి తన దగ్గర ఈ రకంగా ఫోటోలు తీయడానికి డిస్కషన్ చేశారు. ఈ క్రమంలో ఖర్చు ఎంత అవుతుంది అని తెలుసుకునేప్పటికీ నేను షాక్ అయ్యా అంటూ ప్రియమణి సంచలన విషయాలు బయట పెట్టింది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!