(అమరావతి నుండి ‘న్యూస్ ఆర్బిట్’ ప్రతినిధి)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంట విషాదం నెలకొన్నది. ప్రముఖ వైద్యుడు, జగన్ కు స్వయాన మామ ఈసి గంగిరెడ్డి కన్ను మూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేటి తెల్లవారుజామున మృతి చెందారు. డాక్టర్ గంగిరెడ్డి.. వై యస్ జగన్ సతీమణి భారతి తండ్రి. ఆయన పులివెందుల పేదల వైద్యుడిగా పేరు పొందారు. 2001 నుండి 2005 వరకు పులివెందుల ఎంపీటీసీగా బాధ్యతలు నిర్వహించారు. రబీ రైతుల సమస్యలపై గంగిరెడ్డి ఎం పీ పీగా పులివెందుల నుండి కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు.
డాక్టర్ గంగిరెడ్డి మృతితో పులివెందులలో విషాదఛాయలు అనుకున్నాయి. మామ గంగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుండి పులివెందుల బయలుదేరి వెళ్తున్నారు. డాక్టర్ గంగిరెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.