మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక ఖజానా కి చిల్లు పడటమే కాక మానవ జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది. కాగా ఇప్పుడు రాబోతున్నసెకండ్ వేవ్ కూడా మొదటిదాని కంటే ప్రమాదకరంగా ఉంటుందని వైద్యులు హెచ్చరికలు చేస్తున్నారు.
ఎందుకంటే చాలావరకు ప్రపంచవ్యాప్తంగా కూల్ వాతావరణం నెలకొనటంతో ఈ క్రమంలో వైరస్ మరింతగా బలపడే అవకాశం ఉందని కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే లండన్ అదేవిధంగా యూరప్ లో కొన్ని దేశాలలో రెండో దఫా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కాలుష్యం వల్ల కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్యులు తెలపటంతో ఏపీ సర్కార్ దీపావళి పండుగ రోజు షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
పూర్తి విషయంలోకి వెళ్తే దీపావళి పండుగ నాడు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు అనగా రెండు గంటలు మాత్రమే బాణాసంచాలు కాల్చడానికి అనుమతులు ఇచ్చింది. అంతేకాకుండా దీపావళి సందర్భంగా అమ్మే టపాసుల దుకాణం విషయంలో కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. షాపులు వద్ద కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ ఆరు అడుగుల దూరం తప్పనిసరిగా పాటించాల్సిందేనని పేర్కొంది. అంతేకాకుండా దీపావళి సామాన్లు అమ్మే చోట శానిటైజర్ లు వాడకూడదని స్పష్టం చేసింది.