గుండె జబ్బు బారిన పడిన ఏపి రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కు సోమవారం ముంబాయిలోని ప్రముఖ ఏషియన్ హార్ట్ సెంటర్ నందు ఆపరేషన్ నిర్వహించారు. ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఆపరేషన్ దాదాపు 8 గంటలకు పైగా సాగినట్లు తెలుస్తొంది. మంత్రి విశ్వరూప్ ఈ నెల 2వ తేదీన అమలాపురంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి సంగతి తెలిసిందే.అప్పుడు వెంటనే పార్టీ నేతలు రాజమహేంద్రవరంలో ఓ ఆసుపత్రికి తరలించి ప్రాధమిక చికిత్స చేయించారు. అనంతరం మంత్రి కుటుంబ సభ్యులు ఆయనను మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ కు తరలించారు.
అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు.. బ్రెన్ స్టోక్ కారణంగా మంత్రి అస్వస్థతకు గురైనట్లు గుర్తించి వైద్యం అందించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది, ప్రమాదం ఏమి లేదని వైద్యులు చెప్పిన రోజుల వ్యవధిలోనే మంత్రి విశ్వరూప్ మరో సారి ఆనారోగ్యానికి గురైయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ముంబాయికి తీసుకువెళ్లి ఏషియన్ హార్ట్ సెంటర్ నందు జాయిన్ చేశారు. అక్కడ పరీక్షలు జరిపిన వైద్యులు వెంటనే గుండె ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ రోజు మంత్రి విశ్వరూప్ కు శస్త్ర చికిత్స జరిపారు లీలాావతి ఆసుపత్రి గుండె వైద్య నిపుణులు.
కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిన్న రాత్రి విశ్వరూప్ కు ఫోన్ చేసి పరామర్శించారు. శస్త్ర చికిత్స విజయవంతం అవుతుందని జగన్ ధైర్యం చెప్పారు. విశ్వరూప్ సతీమణి బేబీ మీనాక్షి, కుమారుడు కృష్ణారెడ్డి లతో సీఎం జగన్ మాట్లాడారు. తాను అన్ని వేళలా అండగా ఉంటాననీ, విశ్వరూప్ ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడుతుందని అన్నారు. సీఎం జగన్ ఫోన్ చేసి పరామర్శించిన విషయాన్ని విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి అమలాపురంలోని నేతలకు తెలియజేశారు. విశ్వరూప్ త్వరగా కోలుకోవాలని నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.