అమరావతి: జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల మళ్లింపుపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్కి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు గురువారం లేఖ రాశారు.
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లుల చెల్లింపునకు చొరవ చూపాలని చంద్రబాబు లేఖలో కోరారు. 2014-2019 మధ్య ఉపాధి హామీ పథకాన్ని ఏపిలో సమర్థవంతంగా నిర్వహించామని చంద్రబాబు పేర్కొన్నారు. పెండింగ్ బిల్లుల కింద కేంద్రం 1845 కోట్ల రూపాయలు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా జోడించి ఇంకా విడుదల చేయలేదని చంద్రబాబు అన్నారు. ఉపాధి హామీ పథకం చెల్లింపుల విషయంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా నిధులను మళ్లించడం సరికాదని చంద్రబాబు అన్నారు.